iDreamPost
android-app
ios-app

అదిరిపోయే స్కీమ్.. రూ.7 చెల్లిస్తే.. నెలకు ఇంటికి రూ.5 వేలు!

Atal Pension Yojana: ప్రతి ఒక్కరి ఆర్థిక భరోసా అనేది ముఖ్యంగా. వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ క్రమంలోనే కేంద్రం అనేక స్కీమ్ ను ప్రజలకు అందిస్తుంది. అలాంటి వాటిల్లో ఓ సూపర్ స్కీమ్ ఉంది.

Atal Pension Yojana: ప్రతి ఒక్కరి ఆర్థిక భరోసా అనేది ముఖ్యంగా. వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ క్రమంలోనే కేంద్రం అనేక స్కీమ్ ను ప్రజలకు అందిస్తుంది. అలాంటి వాటిల్లో ఓ సూపర్ స్కీమ్ ఉంది.

అదిరిపోయే స్కీమ్.. రూ.7 చెల్లిస్తే.. నెలకు ఇంటికి రూ.5 వేలు!

కేంద్రప్రభుత్వం అనేక పథకాలను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. జీవితం చివరి దశలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు పలు స్కీమ్ లను కేంద్రం  ప్రారంభించింది. అలానే  కేంద్రం నుంచి ఓ  అదిరిపోయే పథకం ఉంది. అందులో కేవలం రోజు 7 రూపాయలు పెటుబడిపెడితే.. 60 ఏళ్లలో మంచి ఆదాయం పొందుతారు. మరి..ఆ పథకం ఏమిటి?, ఆ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో అట్ల పెన్షన్ యోజన్ స్కీమ్ ఒకటి. ఇది ఆర్థికంగా వెనుకబడిన, నెలసరి వేతన కార్మికుల కోసం ఈ స్కీమ్ ను ఏర్పాటు చేశారు. 2015 సంవత్సరంలో ఈ స్కీమ్ ను ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా..నెలవారీగా ఎవరి సామర్థ్యం మేరకు వారు డబ్బులు ఇన్వెస్ట చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 7 కోట్ల మందికి పైగా లబ్ధి పొందారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పించడం. 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండే వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. అలానే ఎవరైనా  ఏళ్ల నాటి  నుంచి నెలకు రూ.210 పెట్టుబడిగా పెట్టవచ్చు. అంటే రోజులు 7 రూరపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

అయితే 60 ఏళ్లు వచ్చేసరికి ప్రతి నెల రూ.5 వేల వరకు పెన్షన్  పొందవచ్చు. ఎవరైనా 60 ఏళ్ల తరువాత నెలకు 5 వేలు పెన్షన్ పొందాలంటే..18 ఏళ్ల వయస్సు నుంచే ప్రతి నెల రూ.210 చెల్లించాలి. లేకుంటే 3 నెలలకు రూ.626 చెల్లించాల్సి ఉంటుంది. అలానే 6 నెలలకు ఒకసారి చెల్లిస్తే రూ.1,239 చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ నెలకు రూ.1000 పెన్షన్ మాత్రమే పొందాలని అనుకుంటే 18 ఏళ్ల నుంచి ప్రతి నెలా రూ.42 చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరిన వ్యక్తి  ఆకస్మికంగా మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి పెన్షన్ చెల్లించబడుతుంది. దురదృష్టవశాత్తు ఇద్దరూ చనిపోతే, చందాదారుని నామినీకి ఆ పెన్షన్ మొత్తం చెల్లించబడుతుంది. అయితే, కొన్ని మినహాయింపులు ఉన్నాయి.

ఈ అటల్ పెన్షన్ పథకాన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులు, పోస్టాఫీసులలో ప్రారంభించవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఖాతాను తెరవవచ్చు. ఇందుకు బ్యాంకు అకౌంట్, ఆధార్ కార్డు తదితరాలను వివరాలు సమర్పరించాల్సి ఉంటుంది. ఈ అటల్ పెన్షన్ యోజన పథకం అసంఘటిత రంగంలో పని చేసే వారికి, మరే ఇతర పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టని వారికి ఉత్తమ ఎంపిక అని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş