iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: ప్రశాంత్ పై రతిక చీప్ గేమ్.. ఎందుకు అంత కుళ్లు!

Bigg Boss 7 Telugu: ప్రశాంత్ పై రతిక చీప్ గేమ్.. ఎందుకు అంత కుళ్లు!

బిగ్ బాస్ హౌస్ లో సొంత టాలెంట్ ఎంత అసవరమో.. తోటి కంటెస్టెంట్స్ సపోర్ట్ కూడా అంతే అవసరం. ఎంత ఇండివిడ్యూవల్ గేమ్ అని చెప్పినా కూడా ఏదో ఒక పాయింట్ లో గ్రూప్ గేమ్ ఆడక తప్పదు. ఈ సీజన్ లో అయితే మొదటి రోజు నుంచే హౌస్ లో గ్రూపులు ఉన్నాయి. ఎప్పుడు చూడు ఒక గ్రూపు మీద మరో గ్రూపు చాడీలు చెప్పుకుంటూనే ఉంటుంది. వాళ్లు అలా చేశారు.. వీళ్లు ఇలా చేశారు అంటూ 5 నిమిషాలు టైమ్ దొరికినా ఫిర్యాదుల పర్వం మొదలు పెడతారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే.. నాలుగో హౌస్ మేట్ ఎవరవుతారు? ఎందుకంటే కంటెండర్లుగా ఉన్న ముగ్గురు హౌస్ లో మంచి దోస్తులు కాబట్టి.

హౌస్ లో పవరాస్త్రం టాస్కు అంటే ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. నాలుగో పవరాస్త్రం ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న.. ప్రేక్షకుల్లోనే కంటెస్టెంట్స్ లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఈ టాస్కులో పోటీ పడుతోంది శుభశ్రీ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ కాబట్టి. వీళ్లల్లో ఎవరు గెలుస్తారు అని అంతా ఎదురుచూస్తున్నారు. వీళ్లకి మొదట పట్టు వదలకు డింభకా అనే టాస్కు ఇచ్చారు. అందులో పవరాస్త్ర ఆకారాన్ని ముగ్గురు తలోవైపు పట్టుకోవాలి. వాళ్లు ఎంతసేపు అయినా అలాగే పట్టుకుని నిల్చున్నారు. అయితే ఇది తేలదు అని బిగ్ బాస్ తర్వాత మీరు ఒకరిని ఒకరు కన్విన్స్ చేసుకోవచ్చు అని చెప్పారు. అందుకు సింపథీ గేమ్ ఆడారు కాసేపు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇంక బిగ్ బాస్ కూడా ఎవరైనా డ్రాప్ అయిచే చెప్పండి అని అడుగుతాడు. ఎవరు వెనక్కి తగ్గకుండా అలాగే పట్టుకుని నిల్చుంటారు. ఇంక ఇలా కాదు అని బిగ్ బాస్ ఆ టాస్కుని రద్దు చేశాడు.

దాని స్థానంలో.. కదలకురా వదలకురా అనే టాస్కుని పెట్టాడు. ఈ టాస్కులో ఒక చెక్క హ్యాండిల్ మీద చివర పవరాస్త్రాన్ని నిల్చోబెట్టారు. అది పడిపోకుండా.. కదలకుండా కర్రను పట్టుకోవాలి. ఆ టాస్కులో ప్రిన్స్ యావర్ విజయం సాధించినట్లు లీకులు వస్తున్నాయి. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. రతికా ఆట చూసి ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హౌస్ లో గేమ్ ఆడటానికి కాకుండా.. కేవలం కంటెంట్ ఇవ్వడం కోసమే వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ టాస్కు ఆడుతున్న సమయంలో రతికా- అమర్ అతని దగ్గరకు వెళ్లి అతడిని డిస్ట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. రతికా మరీ ఓవర్ డైలాగులు వేస్తూ కనిపించింది. అమర్ వచ్చి.. ప్రశాంత్ రతికాకి ఏదో డౌట్ ఉందంటరా.. అసలు అక్కాని ఎందుకు అన్నాడు అంటూ అడుగుతాడు. అందుకు రతికా రోజ్ వానికి బుర్ర లేదు అసలు.. ఇక్కడ మన్నూ మశానం ఉన్నాయి అంటూ కామెంట్ చేసింది.

ప్రశాంత్ నీకు ప్రాబ్లమ్ ఉందారా? ఏం ప్రాబ్లమ్ అంటూ మళ్లీ డిస్టర్బ్ చేస్తాడు. అక్కడితో ఆగకుండా రతికా సిగ్గు లేదా నీకు.. ఇంతేనా పెంచింది నిన్ను అంటూ ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేస్తుంది. అయితే ప్రశాంత్ మాత్రం ఎక్కడా తగ్గకుండా పవరాస్త్రాన్ని అలాగే పట్టుకున్నాడు. ఈ ఒక్క విషయం మాత్రమే కాదు.. కంటెండర్ అయిన సమయంలో కూడా ప్రశాంత్.. రతికాను అక్క అంటూ పిలవగానే చాలా సీరియస్ అవుతుంది. హే పో అవతలకి అంటూ కేకలు వేస్తుంది. ఏ విధంగా చూసుకున్నా రతిక మాత్రం ఆట సంగతి పక్కన పెట్టి కాస్త ఓవర్ గా రియాక్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రశాంత్ గెలవకూడదు అని ఆమె విశ్వ ప్రయత్నాలు చేసింది. ఇది చూసిన ప్రశాంత్ ఫ్యాన్స్.. ఎందుకు మా రైతుబిడ్డ అంటే నీకు అంత కుళ్లు అంటూ రతికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రతికారోజ్.. పల్లవి ప్రశాంత్ పై చేస్తున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి