సామాన్యులకు భారీ షాక్.. 100కు చేరిన టమాటా!

Tomato Price: ఇటీవల నిత్యావసర సరుకుల ధరలు ఏ క్షణంలో పెరిగిపోతున్నాయో అస్సలు అర్థం కావడం లేదు. మార్కెట్ కి వెళ్తే సామాన్యుల జేబుకు చిల్లులు పడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రూ. 40 నుంచి 60 వరకు ఉన్న టమాటా ఏకంగా 100 కు చేరింది.

Tomato Price: ఇటీవల నిత్యావసర సరుకుల ధరలు ఏ క్షణంలో పెరిగిపోతున్నాయో అస్సలు అర్థం కావడం లేదు. మార్కెట్ కి వెళ్తే సామాన్యుల జేబుకు చిల్లులు పడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రూ. 40 నుంచి 60 వరకు ఉన్న టమాటా ఏకంగా 100 కు చేరింది.

గత కొంత కాలంగా సామాన్య ప్రజానికానికి నిత్యావసర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పప్పు, ఉప్ప నుంచి మొదలు చికెన్, మటన్, కూరగాల వరకు రోజు రోజుకీ పెరిగిపోతూ వస్తున్నాయి. ఒకప్పుడు మార్కెట్ లో సంచి తీసుకుని వెళ్తే వంద రూపాయలకు సంచి సగం వచ్చేవని.. కానీ ఇప్పుడు రెండు మూడు ఐటమ్స్ రావడమే కష్టంగా మారిందని వినియోగదారులు బాధపడుతున్నారు. ఇటీవల కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రతిదీ కిలో రూ.50 నుంచి రూ.80 వరకు పలుకుతుంది. మొన్నటి వరకు కిలో రూ.40 నుంచి రూ.60 ఉన్న టమాటా ఇప్పుడు కిలో రేటు వందకు చేరింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కూరగాయలు కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల కారణాంగా రవాణా వ్యవస్థ ఇబ్బందులు, పంట నష్టాల ప్రభావం వెరసి కూరగాయల ధరపై పడుతుంది. చికెన్, మటన్ తో పోటీ పడుతూ కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి. ప్రతీ కూరగాయ 50 నుంచి 60 రూపాయల వరకు అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలోనే టమాటా ధరలు కిలో వందకు చేరుకున్నాయి. రైతు బజార్లో కిలో టమాటా రూ.70 కి లభిస్తే.. రిటైల్ మార్కెట్, తోపుడు బండ్లపై అమ్మేవారు కిలో రూ.100 రూపాయల వరకు అమ్ముతున్నారు. డిమాండ్ కి తగ్గట్టు సరఫరా లేకపోవడం వల్ల టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయని అంటున్నారు. టమాటాతో ఉల్లిపాయ ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి.

ధరల పెరుగుదలతో సామాన్యులు కిలో కొనేవారు అర్థకిలో, పావు కిలో కొనే పరిస్థితికి చేరుకుంది. గత సంవత్సరం టమాటా కిలో ఏకంగా రూ.150 కి పైగా అమ్ముడు పోయాయి. ఈ ఏడాది కూడా కిలో రూ.200 చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. టమాటాతో పాటు మిర్చి కూడా రూ.100 చేరుకుంది. గత 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతిన్నదని రైతులు అంటున్నారు. ఇంట్లో వంట చేయాలంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఉల్లిపాయ, టమాట, పచ్చిమిర్చి. ఇవి ఉంటే మిగతా కూరగాయలు లేకున్నా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ, మిర్చీ ధరలు భారీగా పెరిగిపోవడంతో సామాన్యులు లబో దిబో అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత మండిపోతే ఎలా ఎదుర్కొవాలో అర్థంకాని పరిస్థితిలో సామాన్యులు ఉన్నారు.

Show comments