iDreamPost
android-app
ios-app

ప్రియుడి మోజులో.. భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య!

  • Published Oct 24, 2024 | 3:50 PM Updated Updated Oct 24, 2024 | 3:50 PM

Kakinada Crime News: భారత దేశంలో వివాహబంధం ఎంతో పవిత్రంగా భావిస్తారు. పెద్దల సమక్షంలో మూడుముళ్ల బంధంతో జీవితాంతం తోడుంటానని, కంటికి కనురెప్పలా చూసుకుంటానని చేస్తున్న బాసలు చేసుకుంటారు. కానీ ఈ మధ్య క్షణిక సుఖాల కోసం భార్యభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు.

Kakinada Crime News: భారత దేశంలో వివాహబంధం ఎంతో పవిత్రంగా భావిస్తారు. పెద్దల సమక్షంలో మూడుముళ్ల బంధంతో జీవితాంతం తోడుంటానని, కంటికి కనురెప్పలా చూసుకుంటానని చేస్తున్న బాసలు చేసుకుంటారు. కానీ ఈ మధ్య క్షణిక సుఖాల కోసం భార్యభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు.

ప్రియుడి మోజులో.. భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య!

ఈ మధ్య కాలంలో పచ్చని సంసారాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. పండంటి కాపురాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. క్షణిక సుఖానికి బానిసై నిండు జీవితాలు బలి చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో కారణాల వల్ల గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో కొంతమంది దాంపత్యం కన్నా క్షణిక సుఖానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటున్నాయి.. పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. ఇటాంటి సంఘటనలో నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.  ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే..

కాకినాడ జిల్లా ఏవీ నగరంలో రిఫరల్ హాస్పిటల్ మధు అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే ప్రశాంత్ అనే వ్యక్తి కూడా జాబ్ చేస్తున్నాడు. పెళ్లైన దగ్గరి నుంచి దంపతులు ఎంతో సంతోషంగా కాపురం చేస్తున్నారు. మధుకి తన భార్య అంటే వల్లమాలిన అభిమానం, ప్రేమ. భర్త అన్నా కూడా ఆమెకు ఎంతో ప్రేమ. మధు, ప్రశాంత్ ఒకే కంపెనీలో జాబ్ చేయడం వల్ల మంచి పరిచయం ఏర్పడింది. తరుచూ ప్రశాంత్.. మధు ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఈ క్రమంలోనే మధు భార్యకు ప్రశాంత్ తో సాన్నిహిత్యం పెరిగింది.అది కాస్త హద్దులు దాటి వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొంత కాలం వీరు తమ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగించారు. ఇటీవల తన భార్య ప్రవర్తనలో తేడా గమనించిన మధు ఆమెపై నిఘా పెట్టాడు. ప్రశాంత్ తో కొనసాగిస్తున్న అక్రమ సంబంధం గురించి తెలుసుకున్నాడు. అంతే ఇద్దరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇరువురి కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో ఆమెను గట్టిగానే మందలించారు. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.

తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన భార్య అతని అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రియుడితో కలిసి పక్కాగా మర్డర్ ప్లాన్ చేసింది. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చింది. ఈ నెల 19వ తేదీన ఆహారంలో విషయం పెట్టింది. అది తెలియని మధు విషహారం తిన్నాడు. అలా భర్తను సైలెంట్ గా చంపేసింది. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఇరుగు పొరుగు తో తన భర్త అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయినట్లు నాటకం ఆడింది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసుల. దర్యాప్తులో భాగంగా మృతుడు మధు భార్యకు ప్రశాంత్‌తో ఉన్న ఇల్లీగల్ వ్యవహారం గురించి తెలుసుకున్నారు. తమదైన స్టైల్లో ఆమెను విచారించగా అసలు విషయం బయటపెట్టింది.తమ అక్రమ సంబంధానికి భర్త మధు అడ్డు వస్తున్నాడన్న కోపంతో తన ప్రియుడితో కలిసి చంపేసినట్లు ఒప్పుకుంది. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. భారత దేశంలో వివాహబంధం ఎంతో పవిత్రమైనది. పెద్దల సమక్షంలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్ళు చల్లగా జీవించాలని ఆశీర్వదిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో పెళ్లైన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య బేదాభిప్రాయాలు వస్తున్నాయి.