BIG BREAKING: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. రైలు నిలిపివేత!

తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ మీదుగా ఆదిలాబాద్‌ వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో రైలును నిలిపివేశారు. మధ్య కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో.. ప్రయాణికులు ఇప్పటికే భయం భయంగా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో నిత్యం రద్దీగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా పొగలు రావడంతో.. అగ్రి ప్రమాదం జరుగుతుందేమో అని అందులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

వెంటనే అప్రమత్తమైన పొగలొచ్చిన భోగిలోని ప్రయాణికులు చైన్ లాగడంతో ట్రైన్‌ తిరుపతి జిల్లా వెంకటగిరి-ఎల్లకారు మధ్యలో నిలిచిపోయింది. రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన స్పాట్‌కి చేరుకున్నారు. పొగలు వస్తున్న భోగీలు చాలా సేపు పరిశీలించి.. బ్రేకులు పట్టేయడంతో పొగలు వచ్చినట్లుగా నిర్దారించారు. ప్రమాదం ఏమి లేదని రైల్వే అధికారులు హామీ ఇవ్వడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో సుమారు 20 నిమిషాల పాటు ట్రైన్‌ నిలిచిపోయింది.

ఇదీ చదవండి: జనాన్ని భయపెడుతున్న చెడ్డీ గ్యాంగ్‌ సూత్రధారి అతడే..

Show comments