iDreamPost
android-app
ios-app

జగన్ మళ్ళీ CM కావాలంటూ విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కు

సినీ, రాజకీయ, క్రీడలకు చెందిన సెలబ్రిటీలకు అభిమానులు ఉంటారు. అయితే తమ హీరోల పట్ల ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కొంత మంది వారి పుట్టిన రోజులకు అన్నదానాలు చేస్తూ ఉంటారు. కానీ ఇతడు.. సీఎం జగన్ కోసం..

సినీ, రాజకీయ, క్రీడలకు చెందిన సెలబ్రిటీలకు అభిమానులు ఉంటారు. అయితే తమ హీరోల పట్ల ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కొంత మంది వారి పుట్టిన రోజులకు అన్నదానాలు చేస్తూ ఉంటారు. కానీ ఇతడు.. సీఎం జగన్ కోసం..

జగన్ మళ్ళీ CM  కావాలంటూ విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కు

సెలబ్రిటీలపై ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిమానం ఉంటుంది. తమ అభిమానాన్ని కొంత మంది కొన్ని రకాలుగా ప్రదర్శిస్తుంటారు. అభిమానించే వ్యక్తి పేరు లేదా ముఖ చిత్రాన్ని పచ్చబొట్టు వేయించుకుంటారు. లేదంటే.. వారి పుట్టిన రోజు నాడు..అన్నదానాలు, రక్త దానాలు చేస్తుంటారు. అనాధ, వృద్ధా శ్రమాల్లోని మనుషులతో గడపడం, వారికి దుప్పట్లు, మందులు, ఆహారం పంపిణీ చేస్తుంటారు. దేవాలయాల్లో అభిమానించే వ్యక్తుల పేరిట ప్రత్యేక పూజలు చేస్తుంటారు. సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన సెలబ్రిటీల విషయలో ఫ్యాన్స్ వినూత్నంగా ఇటువంటి పనులు చేస్తూ..వారిపై తమకు ఎంత అభిమానం ఉందో చాటి చెబుతూ ఉంటారు.

ఇదిగో ఈ ఫోటోలో వ్యక్తి కూడా ఓ రాజకీయ సెలబ్రిటీకి వీర ఫ్యాన్. ఆయన కోసం దుర్గమ్మ మెట్లు మోకాళ్లపై ఎక్కి.. మొక్కులు కూడా మొక్కుకున్నారు. ఇంతకు అతడు అభిమానించే నేత ఎవరంటే.. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పాలన అందిస్తోన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.  తిరిగి జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుతూ విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవస్థానానికి వెళ్లి మొక్కుకున్నారు నాయుడు పేటకు చెందిన రెడ్డి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పాలూరు దశరథరామి రెడ్డి. సీఎంకు ఇతడు డై హార్ట్ ఫ్యాన్ లెక్క. మెట్ల మార్గం వద్దకు వెళ్లి.. మోకాళ్లపై నడిచి వెళ్లారు. మెట్టు మెట్టుకు పసుపు, కుంకుమ, హారతి వెలిగించి మొక్కుకున్నారు.

మోకాళ్లతోనే మెట్ల మార్గం గుండా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే జగన్ మళ్లీ సీఎం కావాలని ప్రత్యేక పూజలు చేయించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూళ్లూరు పేట నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసే వైసీపీ నేతను మెజార్టీతో గెలిపించాలని కోరుకున్నారు. సీఎం జగన్ అభిమానించే అభిమానిగా ఆయన తిరిగి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు దశరథ రామి రెడ్డి. ఏపీలో ప్రజా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. నవ రత్నాలు పేరిట.. గడగడపకూ సంక్షేమ పథకాలను అందేలా చేస్తోన్న జగన్ మోహన్ రెడ్డి తిరిగి సీఎం కావాలని కోరుకుంటున్నారు అక్కడి ప్రజలు.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş