iDreamPost
android-app
ios-app

అమ్మ బాబోయ్ ప్రజలను వణికిస్తున్న 200 రూపాయల నోట్.. కారణం ఏమిటంటే..?

  • Published May 17, 2024 | 10:50 AM Updated Updated May 17, 2024 | 10:50 AM

నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లు వచ్చి చేేరాయి. పది రూపాయల నుండి రూ. 500 వరకు ప్రతినోట్ రంగు, రూపు మార్చుకుంది. అలాగే రూ. 200 నోట్ కొత్తగా వచ్చి చేరింది. ఇప్పుడు ఈ కరెన్సీని చూస్తేనే భయపడిపోతున్నారట

నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లు వచ్చి చేేరాయి. పది రూపాయల నుండి రూ. 500 వరకు ప్రతినోట్ రంగు, రూపు మార్చుకుంది. అలాగే రూ. 200 నోట్ కొత్తగా వచ్చి చేరింది. ఇప్పుడు ఈ కరెన్సీని చూస్తేనే భయపడిపోతున్నారట

  • Published May 17, 2024 | 10:50 AMUpdated May 17, 2024 | 10:50 AM
అమ్మ బాబోయ్ ప్రజలను వణికిస్తున్న 200 రూపాయల నోట్.. కారణం ఏమిటంటే..?

ధనమేరా అన్నిటికి మూలం ఆనాడో చెప్పాడు ఓ సినీ కవి. చక్రవర్తికి, వీధి బిచ్చగత్తెకి బంధువు అవుతానని అందీ మనీ మనీ అన్నాడు మరో రచయిత. డబ్బు ఉంటే సుబ్బిగాడినైనా సుబ్బరాజు గారంటారు అంటూ డబ్బు మనిషికి ఎంతటి గౌరవాన్ని తెచ్చిపెడుతుందో చెప్పాడు మరో పొయెట్. దుడ్డు మానవ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుందీ అనేక సంఘటనలు సాక్ష్యాలుగా ఉన్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. ప్రపంచాన్ని నడిపిస్తుంది కూడా డబ్బే కావడంతో దీని ప్రాధాన్యత పెరిగింది. మనిషి అవసరాలకు, అత్యాశలకు నాందిగా మారింది. దీని కోసమే నేర ప్రవృత్తి మొదలై.. ఇప్పుడు పీక్స్‌కు చేరింది. డబ్బును డబ్బుతోనే మోసం చేసి పబ్బం గడుపుకుంటున్నారు కేటుగాళ్లు. అవే నకిలీ నోట్లు.

ఇప్పుడు నకిలీ నోట్ల చెలామణి వ్యవహారం పెట్రేగిపోతుంది. పాత నోట్లు పోయి కొత్త నోట్లు రావడంతో దీన్నే వ్యాపారంగా మలుచుకుంటున్న వారికి వరంగా మారింది. గుర్తించలేని విధంగా, ఏ మాత్రం అనుమానం రాకుండా నకిలీ నోట్లు చేతులు మారుతున్నాయి. విచ్చలవిడిగా ఫేక్ నోట్స్ మార్కెట్‌లోకి వచ్చేశాయి. రూ. 100, రూ. 200, రూ. 500 నకిలీ నోట్లు విపరీతంగా చెలామణి అవుతున్నాయి. ప్రముఖ వార్తా సంస్థ ఆంధ్రజ్యోతి ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిలో ఈ నకిలీ నోట్ల కలకలం ఎక్కువగా ఉందట. డబ్బు చూస్తేనే స్థానిక దుకాణాదారులు భయపడిపోతున్నారట. నకిలీ నోట్లను గుర్తించడంపై అవగాహన ఉన్న వారికి అయితే పర్వాలేదు కానీ.. మిగిలిన వారి పరిస్థితి ఆగమ్య గోచరం. సామాన్యులు, చిరు వ్యాపారులు సైతం భారీగా మోసపోతున్నారు. బడ్డీ కోట్లు, చిన్న చిన్న దుకాణాదారులు నకిలీ నోట్లకు బలౌతున్నారట.

ఒకప్పుడు రూ. 500, రూ. 1000 నకిలీ నోట్లు చెలామణిలో ఉండేవి. నోట్ల రద్దు చేసిన తర్వాత.. రూ. 2000 వేల నోట్లు వచ్చాయి. దీంతో నకిలీ నోట్లు పుట్టుకొచ్చాయి. వెంటనే పెద్ద నోట్లను రద్దు చేశారు. దీంతో వెయ్యి, రెండు వేల రూపాయల నోట్లు రద్దయ్యాయి. అలాగే పాత నోట్ల స్థానంలోకి కొత్త నోట్లు వచ్చాయి. రూ. 100, రూ. 200, రూ. 500 వచ్చి చేరాయి. అయితే రూ. 100, రూ. 500 కన్నా రూ. 200 నోటు మాత్రం సామాన్యులను, వ్యాపారులను భయపెడుతోంది. ఈ కరెన్సీకి ఎక్కువగా నకిలీ మకిలీ పట్టుకుంది. ఆ నోటు చూస్తుంటేనే అమ్మో.. 200 రూపాయల నోటా అంటూ నోరెళ్లబెడుతున్నారు. చదువుకోని వాళ్లు, పేదలు, వృద్దులు ఈ ఫేక్ నోటు బారిన పడుతున్నారు. జిల్లాలో ఈ కరెన్సీ ఎక్కువగా చెలామణి అవుతుండటంతో దీనిపై పోలీసు యంత్రాంగం దీనిపై దృష్టి సారించాలని చిరు వ్యాపారులు, స్థానికులు కోరుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet