Asian Games 2023: CM జగన్‌ను కలిసిన ఏషియన్ గేమ్స్ క్రీడాకారులు!

CM జగన్‌ను కలిసిన ఏషియన్ గేమ్స్ క్రీడాకారులు!

శుక్రవారం సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏషియన్ గేమ్స్ లో పతాకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు కలిసిశారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను సీఎం జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు.

శుక్రవారం సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏషియన్ గేమ్స్ లో పతాకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు కలిసిశారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను సీఎం జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు.

శుక్రవారం సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏషియన్ గేమ్స్ లో పతాకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు కలిసిశారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను సీఎం జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు. ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొన్న ఏపీ క్రీడాకారులైన కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి.. సీఎం జగన్‌ను కలిశారు. ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో ఏపీకి చెందిన పలువురు క్రీడాకారులు పతాకాలు గెలిచారు. క్రీడాకారుల్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దగ్గరుండి సీఎం జగన్‌కు కలిపించారు.

ఇటీవల చైనాలో హౌంగ్జౌ నగరంలో ఆసియా క్రీడలు జరిగాయి. ఈ గేమ్స్ లో భారత్ కి 107 పతాకాలు వచ్చాయి. భారత్ కి ఈ స్థాయిలో పతాకాలు రావడంతో  దేశ ప్రజల గర్వపడుతున్నారు. అంతేకాక ఈ క్రీడల్లో ఏపీ తరపున కోనేరు హంపి, అనూష, యర్రాజీ జ్యోతి వంటి పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన క్రీడాకారులకు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే ఏపీ క్రీడాకారులు సీఎం జగన్ ను కలిసియారు. ఆసియా క్రీడల్లో తాము సాధించిన పతకాలను విజేతలు సీఎం జగన్‌కు చూపించారు. క్రీడా నిబంధనల ప్రకారం ప్లేయర్లలకు ఇచ్చే నగదు పురస్కారాన్ని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఏషియన్ గేమ్స్ లో ఏపీకీ చెందిన మైనేని సాకేత్‌ సాయి,వెన్నం జ్యోతి సురేఖ, కిడాంబి శ్రీకాంత్, ఆర్‌.సాత్విక్‌ సాయిరాజ్, బొమ్మదేవర ధీరజ్ లు పతాకాలు సాధించారు.

ఏషియన్‌ గేమ్స్‌ లో ఏపీ క్రీడాకారులు మొత్తం 11 పతకాలు (5 గోల్డ్, 6 సిల్వర్‌) సాధించారు. ఇక నగదు పురస్కారంతో పాటు గతంలో పతకాలు సాధించినందుకు ఇచ్చే ప్రోత్సాహక బకాయిలు మొత్తం కలిపి రూ.4.29 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఏషియన్‌ గేమ్స్‌ లో ఏపీ క్రీడాకారులు మొత్తం 11 పతకాలు (5 గోల్డ్, 6 సిల్వర్‌)సాధించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్‌ ఎండీ హెచ్‌. ఎం.ధ్యానచంద్ర, శాప్‌ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. మరి.. క్రీడాకారులకు పతకాలు సాధించినందుకు ఇచ్చే ప్రోత్సాహక బకాయిలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments