iDreamPost
android-app
ios-app

సెమీస్, ఫైనల్స్​ భయమొద్దు.. వాళ్లు టీమిండియాను గెలిపిస్తారు: మాజీ క్రికెటర్

  • Published Jun 01, 2024 | 7:21 PM Updated Updated Jun 01, 2024 | 7:21 PM

వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో గ్రూప్ స్టేజ్, సూపర్-8లో టీమిండియా అదరగొడుతుంది. కానీ సెమీస్, ఫైనల్స్ దశలో మాత్రం ఒత్తిడికి చిత్తవుతోంది. ఈసారి కూడా జట్టును అదే భయం వెంటాడుతోంది. అయితే టెన్షన్ అవసరం లేదని ఓ మాజీ క్రికెటర్ అంటున్నాడు.

వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో గ్రూప్ స్టేజ్, సూపర్-8లో టీమిండియా అదరగొడుతుంది. కానీ సెమీస్, ఫైనల్స్ దశలో మాత్రం ఒత్తిడికి చిత్తవుతోంది. ఈసారి కూడా జట్టును అదే భయం వెంటాడుతోంది. అయితే టెన్షన్ అవసరం లేదని ఓ మాజీ క్రికెటర్ అంటున్నాడు.

  • Published Jun 01, 2024 | 7:21 PMUpdated Jun 01, 2024 | 7:21 PM
సెమీస్, ఫైనల్స్​ భయమొద్దు.. వాళ్లు టీమిండియాను గెలిపిస్తారు: మాజీ క్రికెటర్

టీ20 వరల్డ్ కప్-2024లో భారత్ ఫేవరెట్ అని అభిమానుల దగ్గర నుంచి ఎక్స్​పర్ట్స్, మాజీ క్రికెటర్స్ వరకు అందరూ అంటున్నారు. కొందరు లెజెండ్స్ కూడా ఈసారి కప్పు కొట్టేది రోహిత్ సేనేనని బల్లగుద్ది చెబుతున్నారు. టీమిండియా బ్యాటింగ్ సహా అన్ని విభాగాల్లోనూ బలంగా ఉండటం, కన్​సిస్టెంట్​గా పెర్ఫార్మ్ చేస్తుండటం, జట్టు నిండా స్టార్లు ఉండటంతో నిపుణులు కప్పు మన టీమ్​దేనని జోస్యం చెబుతున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా భారత్​ను ఓ విషయం టెన్షన్ పెడుతోంది. అదే బిగ్ మ్యాచెస్. సెమీఫైనల్, ఫైనల్ లాంటి పెద్ద మ్యాచుల్లో టీమిండియా విఫలమవుతుండటం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఈ ఫెయిల్యూర్ వల్ల పలు ఐసీసీ ట్రోఫీలు మిస్సైంది.

గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్​లో ఫస్ట్ మ్యాచ్ నుంచి ఓటమి అనేదే లేకుండా ఫైనల్​కు దూసుకొచ్చింది టీమిండియా. దీంతో అందరూ రోహిత్ సేనదే కప్​ అని అనుకున్నారు. కానీ తుదిమెట్టు మీద బోల్తా పడి టైటిల్ చేజార్చుకుంది. ఈసారి కూడా జట్టును అదే భయం వెంటాడుతోంది. బిగ్ మ్యాచెస్​లో స్టార్ ప్లేయర్లు విఫలమవడం, ఒత్తిడికి లోనై ప్లాన్స్​ను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోవడం మైనస్​గా మారింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెమీస్, ఫైనల్స్ గురించి అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నాడు. టాప్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాదు.. ఈసారి రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కలసి భారత్​కు వరల్డ్ కప్ అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘టీమిండియా ఐసీసీ టోర్నీల్లో బిగ్ మ్యాచెస్​లో తడబడుతోంది. గత కొన్నేళ్లుగా ఇదే సమస్య టీమ్​ను వేధిస్తోంది. సెమీస్, ఫైనల్స్​లో తడబాటు వల్ల కప్పులు చేజార్చుకుంది. అయితే ఈసారి టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే రిషబ్ పంత్ రూపంలో మనకు బిగ్ మ్యాచ్ ప్లేయర్ టీమ్​లో ఉన్నాడు. కీలక మ్యాచుల్లో ఎలా ఆడాలనే కిటుకు అతడికి తెలుసు. ఎంత ఒత్తిడి ఉన్నా తట్టుకొని నిలబడటం, మ్యాచ్​ను ముగించడం అతడికి అలవాటు. పంత్​తో పాటు ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్​లో టీమిండియాకు కీలకం కానున్నాడు. బిగ్ మ్యాచెస్​లో వీళ్లిద్దరూ టీమ్​ను గట్టెక్కిస్తారు. వీళ్లిద్దరి మీద టీమ్ మేనేజ్​మెంట్ మరింత ఫోకస్ చేయాలి. భారత జట్టు భవిష్యత్తుకు వీళ్లు కీలకం కానున్నారు’ అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. మరి.. మంజ్రేకర్ చెప్పినట్లు పంత్, హార్దిక్ టీమ్​ను గెలిపిస్తారని మీరు భావిస్తే కామెంట్ చేయండి.