iDreamPost

APలో ఫ్లెక్సీలు కడుతూ కరెంట్‌ షాక్‌తో స్టార్‌ హీరో అభిమానులు మృతి

  • Published Jul 23, 2023 | 12:49 PMUpdated Jul 24, 2023 | 9:01 AM
  • Published Jul 23, 2023 | 12:49 PMUpdated Jul 24, 2023 | 9:01 AM
APలో ఫ్లెక్సీలు కడుతూ కరెంట్‌ షాక్‌తో స్టార్‌ హీరో అభిమానులు మృతి

సినిమా హీరోలపై అభిమానం రోజురోజుకు శ్రుతిమించుతోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల యువత సినిమా హీరోలపై మితిమీరిన అభిమానంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వారి అభిమానం ఏ స్థాయికి చేరిందంటే చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సినిమా హీరోలపై అభిమానం వారి కన్నవారికి కడుపుకోతను మిగిలిస్తోంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం మోపువారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. తమిళ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా బర్త్‌డే విషెస్ చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి చెందారు. గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థులు నక్క వెంకటేష్, పోలూరు సాయి ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్‌ స్తంభాలు తడిగా ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఫ్లెక్సీ కడుతూ మైనర్లు మృతి చెందడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ముగ్గురు మృతి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి