iDreamPost

వీడియో: ఆసీస్​పై హిస్టారికల్ విక్టరీ.. షాంపెయిన్​తో సచిన్, ద్రవిడ్, గంగూలీ సందడి​!

  • Published Mar 15, 2024 | 7:58 PMUpdated Mar 15, 2024 | 7:58 PM

టీమిండియా లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ సింపుల్​గా, కూల్​గా ఉంటారు. అలాంటోళ్లు షాంపెయిన్​తో రచ్చ రచ్చ చేస్తారని ఊహించగలరా? కానీ ఇది జరిగింది.

టీమిండియా లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ సింపుల్​గా, కూల్​గా ఉంటారు. అలాంటోళ్లు షాంపెయిన్​తో రచ్చ రచ్చ చేస్తారని ఊహించగలరా? కానీ ఇది జరిగింది.

  • Published Mar 15, 2024 | 7:58 PMUpdated Mar 15, 2024 | 7:58 PM
వీడియో: ఆసీస్​పై హిస్టారికల్ విక్టరీ.. షాంపెయిన్​తో సచిన్, ద్రవిడ్, గంగూలీ సందడి​!

భారత క్రికెట్ జట్టు సాధించిన విజయాల్లోకెల్లా అది ఎంతో ప్రత్యేకం. మన టీమ్​ దశ, దిశను మార్చిన గెలుపది. భయం అనేది లేకుండా ఎలా ఆడాలో నేర్పిన మ్యాచ్ అది. ప్రపంచ క్రికెట్​పై భారత్ గుత్తాధిపత్యం చెలాయించగలదనే నమ్మకం అక్కడి నుంచే మొదలైంది. ఎంతటి జట్టు అడ్డొచ్చినా ఓడిస్తూ వెళ్లిపోవడమే.. ఇక నో ఫియర్ అనే భరోసాను ఇచ్చిన ఆ విజయం 2001లో వచ్చింది. క్రికెట్​ మీద పెత్తనాన్ని నడిపిస్తూ ప్రతి జట్టును చిత్తుగా ఓడిస్తూ పోతున్న ఆస్ట్రేలియా ఆ ఏడాది భారత పర్యటనకు వచ్చింది. టీమిండియాను ఈజీగా ఓడించి మరో సిరీస్​ను ఖాతాలో వేసుకుందామని భావించింది. అయితే కోల్​కతాలోని ఈడన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు కంగారూలకు పీడకలగా మిగిలింది. ఆ మ్యాచ్​ భారత క్రికెట్​లో చరిత్రాత్మక విజయంగా నిలిచిపోయింది. ఆ గెలుపు తర్వాత లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ నెవర్ బిఫోర్ సెలబ్రేషన్స్​తో రెచ్చిపోయారు.

గంగూలీ అగ్రెసివ్​గా కనిపిస్తాడు గానీ ద్రవిడ్, సచిన్ మాత్రం ఎప్పుడూ కూల్​గా ఉంటారు. ఎంత పెద్ద విజయం సాధించినా పైకి చూపించరు. ఒకవేళ ఓటమి ఎదురైనా లోలోపలే బాధపడతారు. సచిన్, ద్రవిడ్ పెద్దగా సెలబ్రేషన్ చేసుకోవడం ఎప్పుడూ చూసుండరు. కానీ 2001లో ఈడెన్ గార్డెన్స్​లో ఆస్ట్రేలియాను భారత్ చిత్తుగా ఓడించిన తర్వాత వీళ్లు ఓ రేంజ్​లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకవైపు సచిన్, గంగూలీ.. మరోవైపు ద్రవిడ్​ షాంపెయిన్ బాటిల్స్​తో హల్​చల్ చేశారు. షాంపెయిన్​ను సహచర ప్లేయర్ల మీద పడేలా చల్లుతూ, గట్టిగా కేకలు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. వీళ్ల సందడితో డ్రెస్సింగ్ రూమ్ మొత్తం పండుగ వాతావరణంతో కనిపించింది. ఇది జరిగి 23 ఏళ్లు అవుతోంది. అప్పటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైర​ల్ అవుతోంది.

ఎప్పుడూ కూల్​గా, కామ్​గా ఉండే ద్రవిడ్, సచిన్​లు.. దాదాతో కలసి ఫుల్​గా సెలబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని.. ద్రవిడ్, సచిన్​ల సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవల్​లో ఉన్నాయని అంటున్నారు. ఓడిపోతామనే మ్యాచ్​లో ఆసీస్ లాంటి ఛాంపియన్​ జట్టును చిత్తుగా ఓడించడమంటే మాటలా? వాళ్లు సెలబ్రేట్ చేసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదని చెబుతున్నారు. ఇక, చరిత్రాత్మక ఈడెన్ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన కంగారూ జట్టు 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన భారత్ 171 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియాను ఆసీస్​ ఫాలో ఆన్​కు ఆహ్వానించడంతో మ్యాచ్ చేజారిందని అంతా అనుకున్నారు. కానీ ద్రవిడ్ (180), లక్షణ్ (281) లైఫ్ టైమ్ ఇన్నింగ్స్​లు ఆడటంతో భారత్ రెండో ఇన్నింగ్స్​లో 657 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన ఆసీస్ 212 పరుగులకే ఆలౌట్ అయింది. 171 పరుగుల తేడాతో ఈ మ్యాచ్​లో మన జట్టు నెగ్గింది.

ఇదీ చదవండి: క్రికెట్​లో ఐసీసీ కొత్త రూల్స్.. ఇక కెప్టెన్లకు కష్టాలు తప్పవు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి