iDreamPost

Rohit Sharma: రోహిత్ శర్మ అతడికి కాల్ చేసి మాట్లాడాలి.. మాజీ క్రికెటర్ కామెంట్స్!

  • Published Apr 17, 2024 | 10:09 PMUpdated Apr 17, 2024 | 10:09 PM

ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్​కు టైమ్ దగ్గర పడుతోంది. జూన్​లో మెగా టోర్నీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్​ రోహిత్ శర్మకు ఓ మాజీ క్రికెటర్ ఒక సలహా ఇచ్చాడు.

ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్​కు టైమ్ దగ్గర పడుతోంది. జూన్​లో మెగా టోర్నీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్​ రోహిత్ శర్మకు ఓ మాజీ క్రికెటర్ ఒక సలహా ఇచ్చాడు.

  • Published Apr 17, 2024 | 10:09 PMUpdated Apr 17, 2024 | 10:09 PM
Rohit Sharma: రోహిత్ శర్మ అతడికి కాల్ చేసి మాట్లాడాలి.. మాజీ క్రికెటర్ కామెంట్స్!

టీ20 వరల్డ్ కప్​కు సమయం దగ్గర పడుతోంది. మెగా టోర్నీ మొదలవడానికి ఇంకో నెలన్నర టైమ్ కూడా లేదు. దాదాపుగా అన్ని జట్లు ప్రపంచ కప్ ప్రిపరేషన్స్​లో ఫుల్ బిజీగా ఉన్నాయి. భారత జట్టు ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్​లో తలమునకలైపోయారు. టీమిండియా స్క్వాడ్ సెలక్షన్​ కూడా క్యాష్ రిచ్ లీగ్​లో ఎవరు బాగా ఆడారనే దాని ప్రాతిపదికన జరుగుతోందని సమాచారం. సెలక్టర్లు ఐపీఎల్ మ్యాచుల్ని నిశితంగా పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఓ టీమిండియా మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వెంటనే ఫోన్ తీసుకొని ఆ ప్లేయర్​కు కాల్ చేసి మాట్లాడాలని అన్నాడు. ఎవరా ఆటగాడు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్​కు రోహిత్ కాల్ చేసి మాట్లాడాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. ‘జైస్వాల్ బ్యాటింగ్ అనే నాకు చాలా ఇష్టం. అయితే ఐపీఎల్​లో అతడి పెర్ఫార్మెన్స్ తీవ్రంగా నిరాశపరుస్తోంది. అతడితో రాజస్థాన్ కోచ్ కుమార సంగక్కర మాట్లాడాలి. రోహిత్ శర్మతోనూ మాట్లాడించాలి. హిట్​మ్యాన్ వెంటనే ఫోన్ తీసుకొని అతడికి కాల్ చేయాలి. నువ్వు వరల్డ్ కప్​కు వెళ్లాలి.. కాబట్టి ఈ ఫామ్ పనికిరాదు, కాస్త జాగ్రత్తగా ఆడాలని జైస్వాల్​కు రోహిత్ చెప్పాలి’ అని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. ఒక ఓవర్​లో సిక్స్, బౌండరీ కొట్టాక తర్వాతి బాల్​ను కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించడం వల్లే జైస్వాల్ తరచూ ఔట్ అవుతున్నాడని తెలిపాడు.

జైస్వాల్ విషయంలో ఆకాశ్ చోప్రా చేసిన కామెంట్స్​లో తప్పు లేదు. ఈ మధ్య కాలంలో టీమిండియా విజయాల్లో కీలకంగా మారాడు యశస్వి. ప్రతి ఫార్మాట్​లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతూ తన ప్లేస్​ను సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు. రీసెంట్​గా ఇంగ్లండ్​తో జరిగిన టెస్ట్ సిరీస్​లో బ్యాట్​తో వీరంగం సృష్టించాడు. ఐదు టెస్టుల్లో కలిపి ఏకంగా 712 పరుగులు చేశాడు. అతడి యావరేజ్ 89గా ఉంది. దీన్ని బట్టే అతడు ఎలా చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత ఫామ్​లో ఉన్నోడు తీరా ఐపీఎల్​కు వచ్చేసరికి ఫెయిల్ అయ్యాడు. ఇప్పటిదాకా ఆడిన 7 మ్యాచుల్లో కలిపి కేవలం 121 పరుగులు మాత్రమే చేశాడు. అందుకే అతడితో రోహిత్ మాట్లాడి.. ఫామ్​ అందుకునేలా చూడాలనే ఉద్దేశంతోనే ఆకాశ్ చోప్రా పైకామెంట్స్ చేశాడు. మరి.. జైస్వాల్ బ్యాటింగ్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి