iDreamPost

టీ20 క్రికెట్​కు రోహిత్ దూరం.. ఇక టీమ్ ఫ్యూచర్ అతడి చేతుల్లోనే..!

  • Author singhj Published - 11:13 AM, Thu - 23 November 23

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్​పై ఇప్పుడు చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా టీ20 క్రికెట్​కు హిట్​మ్యాన్ దూరం కానున్నాడనే వార్త ఒకటి.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్​పై ఇప్పుడు చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా టీ20 క్రికెట్​కు హిట్​మ్యాన్ దూరం కానున్నాడనే వార్త ఒకటి.

  • Author singhj Published - 11:13 AM, Thu - 23 November 23
టీ20 క్రికెట్​కు రోహిత్ దూరం.. ఇక టీమ్ ఫ్యూచర్ అతడి చేతుల్లోనే..!

వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్లో భారత్ ఓటమిని ఫ్యాన్స్ ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అసలు ఆ మ్యాచ్​లో మన జట్టు ఎలా ఓడిందంటూ అనాలసీస్​ చేయడంలో మునిగిపోయారు. ఫైనల్ వరకు వరుస విజయాలతో అంత బాగా ఆడుతూ వచ్చిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడటంతో నిరాశలో కూరుకుపోయారు. బ్యాటింగ్ ఫెయిల్యూర్​కు దారుణమైన ఫీల్డింగ్ తోడు కావడంతోనే కప్ చేజార్చుకుందని చెప్పొచ్చు. ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నామనే ఒత్తిడి మన జట్టు ప్లేయర్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. వికెట్లు పడకపోవడంతో ఒక టైమ్​లో పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా స్టంప్స్​ను తన చేతులతో పడేశాడు. మళ్లీ వెంటనే వాటిని ఉండాల్సిన ప్లేసులో ఉంచి వెళ్లిపోయాడు.

బౌండరీలను ఆపడంలో భారత ఫీల్డర్ల ఫెయిల్యూర్ కూడా ఫైనల్లో క్లారిటీగా కనిపించింది. డైవ్​లు వేయకుండా ఫోర్లను ఈజీగా వదిలేశారు. బౌలింగ్​లో వికెట్లు రాకపోవడం ఒకెత్తయితే 18 రన్స్ ఎక్స్​ట్రాల రూపంలో సమర్పించుకోవడం మరొకెత్తనే చెప్పాలి. హార్దిక్ పాండ్యాకు రీప్లేస్​గా పేస్ బౌలింగ్ ఆల్​రౌండర్ లేకపోవడం, మంచి పార్ట్​మైట్ స్పిన్నర్స్​ లేని లోటు కూడా కనిపించింది. మొత్తానికి అయ్యిందేదో అయిపోయింది.. ఇకనైనా వీటిని భర్తీ చేస్తూ టీమ్​ను మరింత బలోపేతం చేయడంపై టీమ్ మేనేజ్​మెంట్, సెలక్టర్లు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక, వరల్డ్ కప్ ముగియడంతో అందరి దృష్టి ఆస్ట్రేలియాతో జరిగే 5 టీ20ల సిరీస్​ వైపు మళ్లింది. ఈ సిరీస్​లో ఆడనున్న భారత జట్టుకు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

టీ20 వరల్డ్ కప్​కు మరో 8 నెలల టైమ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఇక మీదట జరిగే సిరీస్​ల్లో ప్లేయర్లు అందర్నీ పరీక్షించి.. ప్రపంచ కప్ స్క్వాడ్​పై ఒక అంచనాకు రానున్నారు సెలక్టర్లు. అయితే టీ20 వరల్డ్ కప్​లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా? అనే అనుమానాలు వస్తున్నాయి. చాన్నాళ్లుగా ఈ ఇద్దరు ప్లేయర్లు పొట్టి ఫార్మాట్​కు దూరంగా ఉంటున్నారు. అయితే త్వరలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఉండటం, ఆసియా కప్ నుంచి వరల్డ్ కప్​ వరకు బిజీ షెడ్యూల్​తో అలసిపోయారు. అందువల్లే ఆసీస్​తో సిరీస్​లో రోహిత్, విరాట్​ను ఆడించట్లేదని ఊహాగానాలు వస్తున్నాయి. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ టీ20 కెరీర్ విషయంలో బీసీసీఐ ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేసిందట. టీ20 క్రికెట్​కు దూరంగా ఉండాలని హిట్​మ్యాన్ నిర్ణయించుకున్నాడట.

వన్డేల్లో మాత్రం కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాడట రోహిత్. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా చేరవేశాడని క్రికెట్ వర్గాల్లో వినికిడి. కానీ వైట్ బాల్ క్రికెట్​లో హిట్​మ్యాన్ కొనసాగింపు విషయంపై పూర్తి క్లారిటీ కోసం నేరుగా అతడితో డిస్కస్ చేసేందుకు బీసీసీఐ అధికారులు రెడీ అవుతున్నారని సమాచారం. అతి త్వరలో దీనిపై పూర్తి స్పష్టత రానుందని తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ టీ20లకు గుడ్​బై చెబితే.. భారత జట్టు భవిష్యత్తు ఇద్దరు ప్లేయర్లపై డిపెండ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. వాళ్లే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా. రోహిత్ లేని లోటును వీళ్లిద్దరే పూడ్చాల్సి ఉంటుంది. టీ20ల్లో అటాకింగ్ గేమ్​తో అదరగొట్టే సూర్య, ఆల్​రౌండ్ ఎబిలిటీస్​తో గెలుపులో కీలక పాత్ర పోషించే హార్దిక్ ఇక మీదట మరింత రెస్పాన్సిబిలిటీతో ఆడాలి. ముఖ్యంగా హిట్​మ్యాన్ రోల్​ను సూర్య తీసుకోవాలని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. మరి.. టీ20 క్రికెట్​ నుంచి రోహిత్ దూరం అవుతాడనే వార్తలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సచిన్, సెహ్వాగ్ కాదు.. ధోనీనే తన ఫేవరెట్ అంటున్న గంభీర్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి