iDreamPost

ముంబై నుంచి RCBకి రూ.17 కోట్ల ప్లేయర్‌! బెంగళూరు లైనప్ మామూలుగా లేదుగా..!

  • Author singhj Published - 12:46 PM, Mon - 27 November 23

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్ల రిటెన్షన్​ను సద్వినియోగం చేసుకుంది. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్ నుంచి రూ.17 కోట్ల స్టార్ ఆల్​రౌండర్​ను దక్కించుకుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్ల రిటెన్షన్​ను సద్వినియోగం చేసుకుంది. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్ నుంచి రూ.17 కోట్ల స్టార్ ఆల్​రౌండర్​ను దక్కించుకుంది.

  • Author singhj Published - 12:46 PM, Mon - 27 November 23
ముంబై నుంచి RCBకి రూ.17 కోట్ల ప్లేయర్‌! బెంగళూరు లైనప్ మామూలుగా లేదుగా..!

వచ్చే నెల 19వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం జరగనుందనేది తెలిసిందే. ఈ నేపథ్యంలో పది ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న, వదులుకున్న, మార్చుకున్న ప్లేయర్ల లిస్టును ప్రకటించేందుకు ఆదివారం సాయంత్రం 5 గంటల వరకే గడువు నిర్ణయించారు. దీంతో ఈ టైమ్ ముగిసేలోపు ఆయా టీమ్స్ తన ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. అందరి కంటే ఎక్కువగా గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విషయం ఆసక్తిని రేకెత్తించింది. ముంబై ఇండియన్స్​కు అతడు వెళ్లిపోతాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏమవుతందనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. గత రెండు సీజన్లలో గుజరాత్​ను ఫైనల్స్​కు చేర్చడమే గాక, 2022లో ఆ టీమ్​ను విజేతగానూ నిలిపిన హార్దిక్ ఫ్రాంచైజీ మార్పు అంశం సంచలనంగా మారింది. అయితే మొత్తానికి గాసిప్ నిజమైంది. పాండ్యా గుజరాత్ నుంచి ముంబైకి వెళ్లిపోయాడు. ఈ మేరకు ఆ రెండు టీమ్స్ మధ్య ఒప్పందం కుదిరింది.

నెక్స్ట్ సీజన్ నుంచి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్​ను ఆడనున్నాడు. అతడి విషయంలో గుజరాత్​తో ముంబై అగ్రిమెంట్ కుదుర్చుకుంది. పాండ్యాకు ఏడాదికి రూ.15 కోట్లు చెల్లించనుంది ముంబై. అలాగే గుజరాత్​కు ముంబై చెల్లించే భారీ మొత్తంలో 50 శాతం హార్దిక్​కు దక్కనుంది. అయితే అది ఎంత మొత్తమో మాత్రం ఇంకా వెల్లడించలేదు. ముంబై జట్టులో మరో భారీ మార్పు చోటుచేసుకుంది. పాండ్యాను తెచ్చుకున్న ఈ ఫ్రాంచైజీ.. రూ.17.5 కోట్లు వెచ్చించి గత వేలంలో దక్కించుకున్న ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ కామెరాన్ గ్రీన్​ను వదులుకుంది. గ్రీన్​ను ఆర్సీబీకి ఇచ్చేసిందా టీమ్. అయితే పాండ్యా, గ్రీన్ టీమ్ మార్పునకు బీసీసీఐ ఓకే చెప్పినప్పటికీ ఇంకా అఫీషియల్ అనౌన్స్​మెంట్ రావాల్సి ఉంది. హార్దిక్​ను టీమ్​లోకి తీసుకునేందుకు తగినంత డబ్బు లేకపోవడంతో ముందు గ్రీన్​ను బెంగళూరుకు ఇచ్చేసింది ముంబై. ఆ తర్వాత గుజరాత్​తో అగ్రిమెంట్ చేసుకుందని తెలుస్తోంది.

వచ్చే సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తి ప్రక్షాళనకు దిగింది. బౌలింగ్ మీద స్పెషల్​ ఫోకస్​ చేసిన ఆర్సీబీ.. హసరంగ, హర్షల్ పటేల్, హేజల్​వుడ్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్ లాంటి బౌలర్లను వదులుకుంది. వీళ్లను వదిలించుకోవడం ద్వారా ఫండ్స్​ను రైజ్ చేసిన ఆర్సీబీ.. ఆ డబ్బులతో ముంబై ఇండియన్స్ నుంచి స్టార్ ఆల్​రౌండర్ కామెరాన్ గ్రీన్​ను దక్కించుకుంది. అతడు టీమ్​లోకి రావడంతో అటు బ్యాటింగ్​తో పాటు ఇటు బౌలింగ్ కూడా మరింత బలపేతం కానుంది. గ్రీన్ కోసం ముంబైకి రూ.17.5 కోట్లు చెల్లించనుంది ఆర్సీబీ. ట్రేడింగ్​లో ఎస్​ఆర్​హెచ్ నుంచి ఆల్​రౌండర్ మయాంక్ డగర్​ను కూడా దక్కించుకుందా ఫ్రాంచైజీ. ప్లేయర్ల ట్రేడింగ్ తర్వాత బెంగళూరు బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఫాఫ్ డుప్లెసిస్, కామెరాన్ గ్రీన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్​వెల్, దినేష్ కార్తీక్, మయాంక్ డగర్ రూపంలో అద్భుతమైన బ్యాటింగ్ లైనప్​తో ఫేవరెట్​గా కనిపిస్తోంది. మినీ వేలంలో మంచి బౌలర్లను దక్కించుకుంటే ఈసారి ఆర్సీబీకి తిరుగుండదనే చెప్పాలి. మరి.. ఆర్సీబీ లైనప్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: యశస్వి సూపర్‌ బ్యాటింగ్‌.. ఏకంగా రోహిత్‌ శర్మ రికార్డు బ్రేక్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి