iDreamPost

రూ. 2 వేల నోట్లపై RBI కీలక నిర్ణయం.. మార్చుకునేందుకు అప్పటి వరకు ఛాన్స్

రూ. 2 వేల నోట్లపై RBI కీలక నిర్ణయం.. మార్చుకునేందుకు అప్పటి వరకు ఛాన్స్

దాదాపు గత ఆరున్నర సంవత్సరాలుగా చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఈ ఏడాది మే 19న ప్రకటించిన విషయం తెలిసిందే. క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. కాగా ఆ కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు దేశ ప్రజలకు సుమారు 4 నెలల సమయం ఇచ్చింది ఆర్బీఐ. కాగా రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నోట్లను మార్చుకునేందుకు మరో అవకాశాన్ని కల్పించింది. ఆ తేదీలోగా నోట్లను మార్పిడి చేసుకోవచ్చని ఆర్బీఐ ప్రజలకు సూచించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కాగా రూ. 2 వేల కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. సెప్టెంబర్ 30 2023 వరకు రూ. 2 వేల నోట్లు చెల్లుబాటులోనే ఉంటాయని తెలిపంది. ఆ గడువులోగా నోట్లను మార్పిడి చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. నేటితో ఆ గడువు ముగియడంతో రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకునేందుకు గడువు పొడిగించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తాజాగా నోట్లను మార్చుకునేందుకు గడువును అక్టోబరు 7వ తేదీ వరకూ పొడిగించింది. ఈ క్రమంలో తమ వద్ద ఉన్న నోట్లను గడువులోగా సమీప బ్యాంకుల వద్దకు వెళ్లి మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో రూ. 2 వేల నోట్లు చిత్తు కాగితాల్లాగా చెత్త బుట్టలో వేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి