iDreamPost

దారుణం: మైనర్ బాలికపై ప్రియుడి ముందే సామూహిక అత్యాచారం!

దారుణం: మైనర్ బాలికపై ప్రియుడి ముందే సామూహిక అత్యాచారం!

రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికను ముగ్గురు నిందితులు ఆమె ప్రియుడి ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ జోధాపూర్ లో ఓ బాలిక (17) నివాసం ఉంటుంది. అయితే, ఇటీవల ఈ అమ్మాయి ప్రియుడితో కలిసి ఇల్లు వదిలి వెళ్లింది. కాగా, ఆదివారం తెల్లవారుజామున ఈ జంట ఓ చోట నుంచి వెళ్తుండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వీరిని అడ్డగించారు.

ఆ తర్వాత ఆమె ప్రియుడిపై దాడి చేశారు. ఇంతటితో ఆగని ఆ దుర్మార్గులు.. ఒకరి తర్వాత ఒకరు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుల్లో ఇద్దరు ఓ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు గుర్తించారు పోలీసులు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో యూనివర్సిటీ వీరికి ఊహించని షాకిచ్చింది. ఆ ఇద్దరు విద్యార్థులను యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తూ ప్రొఫసర్ కే. ఆర్ పటేల్ నోటీసులు జారీ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: దారుణం: చెల్లిని తుపాకీతో కాల్చి చంపిన మూడేళ్ల చిన్నారి! ఎక్కడంటే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి