iDreamPost

దేశంలో 35 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసుల నిర్దారణ..

దేశంలో 35 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసుల నిర్దారణ..

1147 కి చేరిన కరోనా మరణాలు

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఉధృతంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా 35,043కు పాజిటివ్‌ కేసులు నమోదవగా 1147 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 8889 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.  గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1993 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 73 మంది మరణించారు.

ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 597 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 10498 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 432 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

తెలుగురాష్ట్రాలలో కూడా కరోనా ఉధృతి కొనసాగుతుంది. తెలంగాణలో 1038 పాజిటివ్ కేసులు నమోదవగా, 28 మంది మృతిచెందారు. నిన్న కొత్తగా 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 1403 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా 31 మంది మృతిచెందారు. నిన్న ఒక్కరోజే 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా 3,308,772 మందికి కోవిడ్ 19 సోకగా 234,133 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 1,042,993 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,095,304 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 63,871 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి