iDreamPost
android-app
ios-app

పరుగు పూర్తి చేసినోడే విజేత ..

పరుగు పూర్తి చేసినోడే విజేత ..

విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని టిడిపి తన ఖాతాలో వేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తోంది.. దాన్ని ప్రారంభించింది మేమే అని… టిడిపి ప్రభుత్వ హయాంలోనే 80 శాతం వరకు పనులు అయిపోయాయని.. ప్రస్తుత ప్రభుత్వం కేవలం చివరి పనులు మాత్రమే చేసిందని అంతా టిడిపి చలువే అంటూ డప్పు కొట్టుకుంటున్నరు… అయితే వారికి అర్ధం కానిది ఏమంటే…. రేస్ మొదలు పెట్టినోడు విన్నర్ కాదు… ముగించినోడు విజేత అవుతాడు అనే లాజిక్ పాపం టీడీపీ నేతలకు తెలియడం లేదు.

వాయిదాల మీద వాయిదాలు

కనకదుర్గ ఫ్లైఓవర్ విజయవాడ ట్రాఫిక్ కష్టాలు తీరుస్తుంది. ముఖ్యంగా రద్దీ తో ఉండే వన్ టౌన్ ప్రాంతానికి ఇది ఉపయోగం… కృష్ణలంక ప్రజలకు ఎంతో ఊరట… హైదరాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్ ను విజయవాడ నుంచి పూర్తిగా విభజించే ఈ వారధి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవాడ బస్ స్టాండ్ నుంచి నేరుగా భవనిపురం వెళ్లిపోవచ్చు… దింతో నగర ట్రాఫిక్ హైదరాబాద్ ప్రయాణికులకు విసుగు కలిగించదు… మొత్తం 5.1 కిలోమీటర్ల వారధి పనుల్లో సుమారు 2.6 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్ ఉంటుంది…

2015లో నాంది పలికిన ఈ పనులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి… కేంద్రం 85 శాతం మేర నిధులు ఇస్తున్నా, రాష్ట్రం దాని వాటా సొమ్ము ఇవ్వడానికి ఎన్నోసార్లు బేరాలు పెట్టింది… అంత ఇవ్వలేమని, ఇంత మొత్తం అవసరం అంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని దీనిపై ప్రతిసారి ఢిల్లీ వెళ్లడం కేంద్రం నిధులు పెంచాలని బేరం పెట్టి రావడంతో పనులు దాదాపు నిలిచిపోయాయి…

చంద్రబాబు సైతం దీనిపై శ్రద్ధ పెట్టక పోవడంతో 2017 సంవత్సరం అంతా అసలు పనులు జరగని పరిస్థితి తలెత్తింది… సోమా కంపెనీ కొన్ని సార్లు ఇలా అయితే తాము పనులు చేయలేమని చేతులు ఎత్తేసింది.. దీనితో 282 కోట్ల రూపాయలతో, 2 ఏళ్ళలో అంటే 2017 దసరా నాటికి పూర్తి చేస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు… తర్వాత వారధిపై రకరకాల డెడ్ లైన్లు పెట్టి కాలం గడిపేశారు….

మరోపక్క కేంద్రం తో తన అవసరాల మేరకు కయ్యం పెట్టుకున్న చంద్రబాబు తీరుతో వారధి నిర్మాణానికి కేంద్రం తగిన నిధులు విడుదల చేయలేదు… దీనితో ప్రాజెక్ట్ వ్యయం పెరిగింది… అడిగిన మొత్తం ఇస్తే గాని పనులు చేయలేమని సోమా కంపెనీ ఖరకండిగా చెప్పడంతో వారధి వ్యయం డబుల్ అయ్యింది… 440 కోట్ల మేర చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా వారధికి వ్యయం అయ్యింది.

ఆర్ధిక అవకతవకలు

పోలవరం చంద్రబాబుకు ఎటిఎం ఎలా అయ్యిందో… కనకదుర్గ వారధి పనులను బాబు గారు వదల్లేదు కృష్ణా పుష్కరాల వేల … తర్వాత జరిగిన ఒక కార్యక్రమంలో వారధికి రంగులు, గార్డెనింగ్ అంటూ 12 కోట్ల.మేర బిల్లులు పెట్టుకున్నారు… పూర్తి కానీ వారధికి రంగులు ఎందుకు..?? పచ్చదనం ఎందుకు అని విజయవాడ జనం ఆశ్చర్యపోయారు… అయితే దీని వెనుక కోట్ల రూపాయల అవినీతి ఉందని తర్వాత ఆలస్యంగా తెలుసుకొని… నోటిపై వేలు వేసుకున్నారు….

ఏడాదిగా పరుగులు

వారధి నిర్మాణం లో గడిచిన ఏడాది కీలకం… పనులను పరుగులు పరుగులు పెట్టించడంలో అధికారులు సఫలం అయ్యారు… కేంద్రం తన పూర్తి వాటా విడుదల చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు ఇచ్చారు… దీనితో ప్రాజెక్ట్ పనులు వేగం పెరిగాయి… రోజువారీ సమీక్ష చేయడంతో గత సంవత్సరం నుంచి నిర్మాణ కంపెనీ తన డైలీ రిపోర్టు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది… దింతో అజమాయిషీ మేరకు జాగ్రత్త పడ్డారు… లేకుంటే ఫీనిషింగ్ వర్క్ పేరిట మరి కొద్దీ కాలం గడిచిపోయేది.

ఏది ఏమైనా సెప్టెంబర్ 4న విజయవాడ వాసుల చిరకాల కల నెరవేర్చడంలో… అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం మొదలు పెట్టినా పూర్తి చేయడం బాధ్యత అని నిరూపించుకోవడంలో జగన్ ప్రభుత్వం బెజవాడ వాసుల మన్ననలు పొందుతుంది అనడంలో సందేహం లేదు….