iDreamPost
android-app
ios-app

ఆ టైంలో ముంబైలోనే ఉన్నాను.. సినిమా చూసి ఏడ్చేసిన సదా..

  • Published Jun 19, 2022 | 2:24 PM Updated Updated Jun 19, 2022 | 2:24 PM
ఆ టైంలో ముంబైలోనే ఉన్నాను.. సినిమా చూసి ఏడ్చేసిన సదా..

‘జయం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన భామ సదా. ఆ తర్వాత, తెలుగు, తమిళ్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మరి వరుస సినిమాలు చేసింది. గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సదా పలు టీవీ షోలలో కనిపిస్తూ ఉంది. తాజాగా సదా మేజర్ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకుంది.

అడివి శేష్ హీరోగా ముంబయి ఉగ్రదాడిలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌గా తెరకెక్కిన ‘మేజర్‌’ సినిమాని చుసిన వారంతా ఎమోషనల్‌ అవుతున్నారు. తాజాగా మేజర్ సినిమా చూసిన సదా కూడా ఎమోషనల్‌ అయి కన్నీళ్లు పెట్టుకుంది.

ఇక మేజర్ సినిమా చూసి వచ్చాక సదా మీడియాతో మాట్లాడుతూ.. ”ఉగ్రదాడి జరిగిన సమయంలో నేను ముంబైలోనే ఉన్నాను. ఇప్పుడు మేజర్ సినిమా చూస్తుంటే అప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ సంఘటనలని ఇలా తెర మీద చూస్తుంటే ఆ బాధ బయటకి వచ్చింది. సినిమాకోసం అన్ని విభాగాలు బాగా కష్టపడి పని చేశాయి. ఫస్ట్ హాఫ్ లోనే ఏడ్చేసాను. ఈ సినిమా చూసి చాలా గర్వంగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక సినిమా నన్ను ఏడిపించింది. అడివి శేష్ చాలా అద్భుతంగా చేశారు. ఇలాంటి కథలు అందరికి తెలియాలి, శశికిరణ్ బాగా తెరకెక్కించారు ఈ సినిమాని” అని తెలిపింది.

View this post on Instagram

A post shared by Major (@majorthefilm)

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş