iDreamPost
iDreamPost
పాకిస్తాన్ ఆర్మీకి మరోసారి భారత్ సైన్యం గట్టి జవాబు ఇచ్చింది. జమ్ముకాశ్మీర్ నియంత్రణ రేఖ దగ్గర గురేజ్ సెక్టార్ నుంచి యూరీ సెక్టార్ వరకు పాకిస్తాన్ సైన్యం పెద్ద ఎత్తున కాల్పులకి తెగబడినట్టు తెలియవచ్చింది . ఈ కాల్పుల్లో 39ఏళ్ల BSF సబ్ ఇన్స్పెక్టర్ రాకేష్ దోవల్ తో పాటు ముగ్గురు జవాన్లు మరో ముగ్గురు సామాన్య పౌరులు మరణించినట్టు తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ దుశ్చర్యకు దీటుగా జవాబు ఇచ్చిన భారత్ సైన్యం ఎదురు కాల్పుల్లో 8మంది పాకిస్తాన్ సైనికుల్ మట్టుపెట్టినట్టు, మరో 10మంది పాక్ సైనికులను గాయపరిచినట్టు వార్తలు వస్తున్నాయి.
భారత్ లోకి చొరబడేందుకు ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీ మొదటి నుండి సహాయ సహకారాలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు కూడా ఉగ్రవాదులను భారత్ లోకి పంపించేందుకు పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత జవాన్లపై కాల్పులకు తెగబడినట్లు ప్రాధమిక సమాచారం . దీంతో భారత్ ఆర్మీ వారి సైనికులని హతమార్చడంతో పాటు పెద్ద సంఖ్యలో పాక్ ఆర్మీ బంకర్లు,ఫ్యూయల్ డంప్స్,లాంఛ్ ప్యాడ్ లను నాశనం చేసి ధీటుగా బదులిచ్చింది.