iDreamPost
android-app
ios-app

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందడి మొదలు కానుంది. జగన్ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎంపికయిన విషయం తెలిసిందే. దీంతో వాళ్లిద్దరూ తమ మంత్రి పదవులతో పాటూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయగా ఆమోదం తెలపడంతో ఎమ్మెల్సీ స్థానానాలకు ఖాళీ ఏర్పడింది.

దాంతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదలకానుంది. ఆగస్టు 13 నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ. ఆగస్టు 24 న పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. కాగా ఈ ఎమ్మెల్సీ పదవి కోసం అనేకమంది ఆశావహులు పోటీపడుతున్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుండి నలుగురు రాజ్యసభకు వెళ్లారు.వారిలో మోపిదేవి, పిల్లి చంద్రబోస్‌లతో పాటూ అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు ఉన్నారు. కాగా మోపిదేవి వెంకట రమణ, పిల్లి చంద్రబోస్‌లు ఇటీవలే రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.దాంతో ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్పడింది.