Idream media
Idream media
భవన నిర్మాణ కార్మికులంతా బాధ పడుతుంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ మాత్రం దాని నుంచి రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. బుధవారం అయన విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియా తో మాట్లాడారు. ఇసుక కొరత అంటూ నారా లోకేష్ ఐదు గంటల దీక్ష కామిడి స్కిట్లా ఉందంటూ కన్నబాబు ఎద్దేవా చేశారు.
ప్రభుత్వంపై తండ్రీకొడుకులు బురద చల్లాలని చుస్తున్నారని, ఐదేళ్ళలో.. ఇసుక, మట్టి తవ్వకాలను అవినీతికి అడ్డాగా మార్చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాగానే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయని, రైతాంగమంతా సుభిక్షంగా ఉందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.