హైదరాబాద్లోని బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పైనుంచి కారు దూసుకొచ్చిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కుబ్రా బేగంకుజగన్ సర్కార్ అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం ఆంధ్రప్రదేశ్ సర్కార్ భరించనుంది. పెయింటర్గా పనిచేస్తున్న అబ్దుల్ అజీమ్ తన కుమార్తె ఆపరేషన్కు అయ్యే ఖర్చులు చెల్లించే స్తోమత లేని విషయం సీఎం జగన్ దృష్టికి వచ్చింది. స్పందించిన సీఎం వైఎస్ జగన్.. కుబ్రా పూర్తిగా కోలుకునేంత వరకు చికిత్స చేయించాలని అధికారులను ఆదేశించారు.
అందుకయ్యే ఖర్చులను పూర్తిగా ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) నుంచి భరించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో ప్రభుత్వ అధికారులు కేర్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. దీంతో కుబ్రాకు సోమవారం ఉదయం నుంచే పూర్తిస్థాయి వైద్యసేవలు అందటంతో ఆమె తండ్రి అబ్దుల్ అజీమ్, కుటుంబ సభ్యులు సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు ఆస్పత్రికి వెళ్లి కుబ్రా ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.