Idream media
Idream media
తెనాలి మాజీ ఎమ్మెల్యే నేత డాక్టర్ రావి రవీంద్రనాథ్ మరణించారు. గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోతుదిశ్వాస విడిచారు. గత ఐదు నెలలుగా హైదరాబాద్లో ఉన్న ఆయన చిన్న కుమార్తె దగ్గర ఉండి చికిత్స పొందుతున్నారు.
కర్ణాటకలోని గుల్బర్గాలో రావి రవీంద్రనాథ్ ఎంబిబిఎస్ చేశారు. ఆ సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్కు ఆయన క్లాస్మెట్. ఎనభై దశకం మొదటిలో ఆయన తెనాలిలో డాక్టర్గా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.తన వైద్య సేవలతో ఆ ప్రాంత ప్రజల ఆదరాభిమానాలు పొందాడు.. తర్వాత రాజకీయాలలోకి ప్రవేశించిన ఆయన 1981-86, 1987-1992 మధ్య తెనాలి మున్సిపల్ ఛైర్మన్గా రెండు పర్యాయాలు పనిచేశారు.1994 అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుపై విజయం సాధించారు.
రవీంద్రనాథ్ తండ్రి రావి అమ్మయ్య కమ్యూనిస్ట్ నాయకులు. తెనాలి నుంచి 1955 & 1962 ఎన్నికల్లో సిపిఐ తరుపున పోటీచేసి కాంగ్రెస్ నేత ఆలపాటి వెంకట్రామయ్య మీద ఓడిపోయారు.
2014 ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇచ్చిన రవీంద్రనాథ్ 2019 ఎన్నికల్లో స్తబ్దుగా ఉండిపోయారు.