iDreamPost
android-app
ios-app

ఓటుకు నోటు కేసులో ఏ3 అరెస్ట్.

  • Published Dec 16, 2020 | 4:02 PM Updated Updated Dec 16, 2020 | 4:02 PM
ఓటుకు నోటు కేసులో ఏ3 అరెస్ట్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తొలినాళ్లలో తెలంగాణా శాసనమండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ టిడిపి అభ్యర్థికి మద్దతుగా ఓటు వేసేందుకు రూ. 50లక్షలు లంచం ఎర చూపారు. ఈ సందర్భంగా నాటి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. లంచం ఇస్తున్న సందర్భంగా నాటి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కూడా ఫోన్ లో మాట్లాడించారు. వీటికి సంబంధించిన ఆడియో, వీడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఈ సంఘటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించడంతో పాటు, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి హడావుడిగా పెట్టేబేడా సర్దుకుని అమరావతికి తరలివచ్చే పరిస్థితులు కల్పించింది.

ఇదిలా ఉంటే తాజాగా ఏళ్ళుగా నలుగుతున్న ఈ కేసులో ఎ3 నిందితుడుగా ఉన్న ఉదయ్‌సింహను ఏసీబీ అధికారులు నేడు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంభందించి ఇటీవల విచారణ చేపట్టిన ఏసీబీ ప్రత్యేక కోర్టు, చెప్పిన సమయానికి విచారణకు హాజరు కాకుండా కోర్టు వారికి సహకరించకుండా తిరుగుతున్న నిందితుడు ఉదయ్‌సింహపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. ఈ నేపధ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఉదయ్‌సింహను అరెస్టు చేశారు. ఉదయ్‌సింహను అధికారులు ఏసీబీ కోర్టులో గురువారం హాజరుపరచనున్నారు.