iDreamPost

దారుణం: భార్యను చితక్కొట్టి కొట్టి మూత్రం తాగించిన భర్త!

దారుణం: భార్యను చితక్కొట్టి కొట్టి మూత్రం తాగించిన భర్త!

భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం. కానీ, ఇంత దానికే కొందరు దంపతులు దారుణానికి పాల్పడుతున్నారు. క్షణికావేశంలో హత్యలకు కత్తులు కూడా నూరుతున్నారు. ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ భర్త భార్యను ఇంట్లో చితకొట్టాడు. ఇంతటితో ఆగని ఈ దుర్మార్గుడు ఆమెను బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి మూత్రం తాగించాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అనంతరం భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. మధ్య ప్రదేశ్ అవుద్ పురి ప్రాంతంలో రాజేంద్ర మాలవ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు తరుచు మద్యం తాగొచ్చి భార్యను వేధిస్తుండేవాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేశారు. ఈ క్రమంలోనే భార్య.. భర్తను ” తూ” అని అరిచిందట. దీంతో భర్త రాజేంద్ర మాలవ్యకు పట్టరాని కోపం వచ్చింది. దీంతో అతడు భార్యను దారుణంగా కొట్టాడు. ఇంతే కాకుండా భార్యను బాత్రూమ్ లోకి తీసుకెళ్లి మూత్రం తాగించి దారుణంగా ప్రవర్తించాడు.

ఇక భర్త చేసిన కిరాతకాన్ని భార్య సహించలేకపోయింది. అదే రోజు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజేంద్ర మాలవ్యను అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. భార్య ” తూ” అనిందని దారుణానికి దిగిన భర్త కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: విషాదం: ఊయల మెడకు బిగుసుని బాలుడు మృతి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి