iDreamPost

నేను దేవుడ్నంటూ స్టేషన్‌కు.. తలలు పట్టుకున్న పోలీసులు!

నేను దేవుడ్నంటూ స్టేషన్‌కు.. తలలు పట్టుకున్న పోలీసులు!

కర్నూలు జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తాను దేవుడ్నంటూ పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కాడు. అంతటితో ఆగకుండా ఓ వింత కేసుపెట్టి.. పోలీసుల బుర్ర తిన్నాడు. అతడి ఫిర్యాదుతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్నూలు జిల్లా కోసిగి పోలీస్‌ స్టేషన్‌కు పండుగ రోజున ఓ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి తన పేరు లక్ష్మీ నరసింహ స్వామిగా చెప్పాడు. తర్వాత తానో దేవుడ్ని అన్నాడు. దీంతో పోలీసులు షాక్‌ అయ్యారు. ఆ వ్యక్తి అంతటితో ఆగలేదు.

ఆంధ్రప్రదేశ్‌లలోని బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా తనదేనని, ఎవరో ఆ డబ్బును దొంగతనం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు తనను ఎవరో చంపడానికి చూస్తున్నారని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఆ వ్యక్తి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ వార్త ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి