iDreamPost

మళ్ళీ వార్తల్లో కరాటే కళ్యాణి.. 20 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు..

మళ్ళీ వార్తల్లో కరాటే కళ్యాణి.. 20 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు..

ఇటీవల కరాటే కళ్యాణి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దాదాపు వారం రోజుల పాటు వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది కళ్యాణి. ప్రాంక్‌ పేరుతో ఆసభ్యవీడియోలు చేస్తున్నాడంటూ యూట్యూబర్‌ శ్రీకాంత్‌పై కరాటే కల్యాణి దాడి చేయడం, అతను కూడా ఆమెపై దాడి చేయడం, ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీసులకి ఫిర్యాదు చేయడం, తర్వాత కళ్యాణి డబ్బులు తీసుకొని మోసం చేసిందని ఫిర్యాదులు రావడం, పిల్లలని కిడ్నాప్ చేసిందని ఆరోపణలు, ఒక రోజు కనపడకుండా పోవడం, కళ్యాణి సంచలన ప్రెస్ మీట్.. ఇలా వారం రోజుల పాటు కరాటే కళ్యాణి రచ్చ రచ్చ చేసింది.

తాజాగా మరోసారి కరాటే కళ్యాణి వార్తల్లో నిలిచింది. గతంలో పెట్టిన ప్రెస్ మీట్ లోనే పలు యూట్యూబ్ ఛానళ్లపై కేసు వేస్తాను త్వరలో అని తెలిపింది. తాజాగా అసభ్యకర ప్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్‌పై, పిచ్చి పిచ్చి థంబ్ నైల్స్ పెడుతున్న పలు ఛానళ్లపై కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు ఇరవై యూట్యూబ్ ఛానెళ్లపై సాక్ష్యాలతో సహా సైబర్ క్రైమ్ పోలీసులకు కళ్యాణి ఫిర్యాదు చేసింది. త్వరలో మరో 20 ఛానళ్లపై కూడా కేసు పెట్టనున్నట్టు కరాటే కళ్యాణి తెలిపింది. ఈ ఫిర్యాదు తీసుకొని పోలీసులు ఐటీ యాక్ట్‌లోని 67A, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే సదరు యూట్యూబ్ ఛానెళ్లకు పోలీసులు నోటీసులు పంపనున్నట్టు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి