iDreamPost

వద్దనుకున్నోడే మ్యాచ్ విన్నర్ అయ్యాడు.. RCB నయా హీరో!

  • Published May 13, 2024 | 3:38 PMUpdated May 13, 2024 | 3:38 PM

టీమ్​లో అతడు వద్దంటే వద్దని ఆర్సీబీ ఫ్యాన్స్ గోల గోల చేశారు. అలాంటోడు జట్టులో ఉంటే ఇక కప్పు కొట్టినట్టేనని అన్నారు. కానీ ఆ ప్లేయరే ఇప్పుడు మ్యాచ్ విన్నర్ అయ్యాడు. ఆర్సీబీకి నయా హీరోగా మారాడు.

టీమ్​లో అతడు వద్దంటే వద్దని ఆర్సీబీ ఫ్యాన్స్ గోల గోల చేశారు. అలాంటోడు జట్టులో ఉంటే ఇక కప్పు కొట్టినట్టేనని అన్నారు. కానీ ఆ ప్లేయరే ఇప్పుడు మ్యాచ్ విన్నర్ అయ్యాడు. ఆర్సీబీకి నయా హీరోగా మారాడు.

  • Published May 13, 2024 | 3:38 PMUpdated May 13, 2024 | 3:38 PM
వద్దనుకున్నోడే మ్యాచ్ విన్నర్ అయ్యాడు.. RCB నయా హీరో!

ఆ జట్టునే ముంచేశాడు, అతడు మనకెందుకు? అన్నారు. టీమ్​లో అతడు వద్దంటే వద్దని ఆర్సీబీ ఫ్యాన్స్ గోల గోల చేశారు. అలాంటోడు జట్టులో ఉంటే ఇక కప్పు కొట్టినట్టేనని అన్నారు. కానీ ఆ ప్లేయరే ఇప్పుడు మ్యాచ్ విన్నర్ అయ్యాడు. ఆర్సీబీకి నయా హీరోగా మారాడు. ఐపీఎల్-2024లో ఇప్పుడు అందరూ బెంగళూరు గురించే మాట్లాడుకుంటున్నారు. సీజన్ మొదట్లో వరుస పరాజయాలతో విమర్శల పాలైంది డుప్లెసిస్ సేన. ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అవడం పక్కనపెడితే.. పరువు దక్కితే అదే పది వేలని అనుకున్నారు. కానీ వరుసగా 5 విజయాలతో గన్ నుంచి ఫైర్ అయిన బుల్లెట్​లా దూసుకెళ్తోంది ఆర్సీబీ. ఆ టీమ్ సక్సెస్​లో కీలకంగా మారాడో ప్లేయర్. అతడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్సీబీకి నయా హీరోగా అవతరించాడు లెఫ్టార్మ్ పేసర్ యష్ దయాల్. గత సీజన్​లో గుజరాత్ టైటాన్స్​కు ప్రాతినిధ్యం వహించాడతను. తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ మంచి బౌలర్​గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఓ మ్యాచ్​లో కోల్​కతా నైట్ రైడర్స్ ఫినిషర్ రింకూ సింగ్ చేతిలో అతడు బలయ్యాడు. యష్ బౌలింగ్​లో వరుసగా 5 సిక్సులు బాదాడు రింకూ. దీంతో అతడ్ని జీటీ రిలీజ్ చేసింది. ఈ దెబ్బతో తీవ్ర నిరాశలో కూరుకుపోయాడీ పేసర్. ఒత్తిడి, ఫెయిల్ అయ్యాననే బాధతో కొన్నాళ్లు క్రికెట్​కు దూరంగా ఉన్నాడు. అయితే ఆ పెయిన్ నుంచి రికవర్ అయ్యాక తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్​లో అదరగొట్టాడు. దీంతో ఈ సీజన్​కు ముందు జరిగిన మినీ ఆక్షన్​లో దయాల్​ను కొనుక్కుంది ఆర్సీబీ.

రింకూ చేతిలో బలైన యష్ ఆర్సీబీలోకి రాగానే ఆ టీమ్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. అతడో చెత్త బౌలర్ అని, ఒకే ఓవర్​లో 5 సిక్సులు ఇచ్చిన ప్లేయర్​ను తీసుకోవడాన్ని మించిన మూర్ఖత్వం ఇంకొకటి లేదన్నారు. అతడు టీమ్​లో ఉండటానికి వీల్లేదని చెప్పారు. కానీ ఇప్పుడు అతడే మ్యాచ్ విన్నర్​గా మారాడు. ఇప్పటిదాకా ఆడిన 12 మ్యాచుల్లో కలిపి 13 వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ 8గా ఉంది. దీన్ని బట్టే అతడు పొదుపుగా పరుగులు ఇస్తూ, వికెట్లు పడగొడుతూ టీమ్ విజయాల్లో ఎంత కీలకంగా మారాడో అర్థం చేసుకోవచ్చు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లోనూ అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్​తో పాటు కుల్దీప్ యాదవ్​ను ఔట్ చేశాడు. ఇన్నాళ్లూ విలన్​గా భావించినోడు ఇప్పుడు ఆర్సీబీకి హీరోగా మారాడు. అతడు ఇలాగే అదరగొడితే బెంగళూరు ప్లేఆఫ్స్​కు చేరడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. యష్ దయాల్ బౌలింగ్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి