iDreamPost

MI vs GT: స్టేడియంలో పొట్టుపొట్టు కొట్టుకున్న రోహిత్‌-పాండ్యా ఫ్యాన్స్‌!

  • Published Mar 25, 2024 | 3:16 PMUpdated Mar 25, 2024 | 3:16 PM

ఐపీఎల్-2024లో భాగంగా ముంబై-గుజరాత్ మ్యాచ్​లో ఫ్యాన్స్ మధ్య ఫైట్ జరిగింది. రోహిత్ శర్మ- హార్దిక్ పాండ్యా అభిమానులు స్టేడియంలోనే పొట్టుపొట్టు కొట్టుకున్నారు.

ఐపీఎల్-2024లో భాగంగా ముంబై-గుజరాత్ మ్యాచ్​లో ఫ్యాన్స్ మధ్య ఫైట్ జరిగింది. రోహిత్ శర్మ- హార్దిక్ పాండ్యా అభిమానులు స్టేడియంలోనే పొట్టుపొట్టు కొట్టుకున్నారు.

  • Published Mar 25, 2024 | 3:16 PMUpdated Mar 25, 2024 | 3:16 PM
MI vs GT: స్టేడియంలో పొట్టుపొట్టు కొట్టుకున్న రోహిత్‌-పాండ్యా ఫ్యాన్స్‌!

ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ జరిగింది. చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ హైటెన్షన్ మ్యాచ్​లో గుజరాత్ 6 పరుగుల థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ 168 రన్స్ చేసింది. ఛేజింగ్​కు దిగిన ఎంఐ 162 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్​లో గెలుపోటముల కంటే కూడా మిగిలిన విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్ చేయడం, రోహిత్ శర్మ అభిమానులు అతడ్ని ‘కుక్క.. కుక్క’ అంటూ గేలి చేయడం హాట్ టాపిక్​గా మారాయి. అయితే ఇదే మ్యాచ్​లో స్టేడియంలో ఫ్యాన్స్ పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హార్దిక్ పాండ్యా-రోహిత్ శర్మ అభిమానుల మధ్య అహ్మదాబాద్ స్టేడియంలో ఫైట్ జరిగింది. ఇద్దరి ఫ్యాన్స్ పొట్టుపొట్టు కొట్టుకుంటున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరిపై ఒకరు పంచ్​లు విసురుతూ, కుర్చీల మీద దొర్లుతూ మరీ ఫైట్ చేశారు. పాండ్యా ఫ్యాన్స్​ను రోహిత్ ఫ్యాన్స్ చితకబాదారు. దీంతో అసలు వాళ్లు ఎందుకు గొడవపడ్డారు? ఒకే జట్టు అభిమానులు ఇలా ఫైట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అనేది తెలుసుకునేందుకు ఆడియెన్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ సీజన్ మొదలవడానికి ముందే రోహిత్-పాండ్యా ఫ్యాన్స్ మధ్య వార్ స్టార్ట్ అయింది. జట్టుకు 5 కప్పులు అందించిన హిట్​మ్యాన్​ను ముంబై కెప్టెన్సీ నుంచి పీకేయడం అప్పట్లో సంచలనంగా మారింది. గుజరాత్​కు సారథిగా ఉన్న హార్దిక్​ పాండ్యాను తీసుకొచ్చి టీమ్ కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీస్ అప్పగించించారు.

టీమ్​కు కప్పులు అందించినోడు, భారత జట్టును కూడా అద్భుతంగా నడిపిస్తూ సూపర్ ఫామ్​లో ఉన్న రోహిత్​ను అర్ధంతరంగా కెప్టెన్సీ నుంచి తీసేయడం అతడి అభిమానులకు నచ్చలేదు. అందునా ముంబైని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయిన హార్దిక్​ను తిరిగి తీసుకురావడంతో వాళ్లు సీరియస్ అయ్యారు. దీనికి తోడు గుజరాత్ టైటాన్స్​తో ఆదివారం జరిగిన మ్యాచ్​లో రోహిత్​ను బౌండరీ దగ్గర ఫీల్డింగ్ ఉండమని పాండ్యా ఆదేశించాడు. హిట్​మ్యాన్ ఫ్యాన్స్ పట్టరాని కోపంతో ఊగిపోయారు. ఈ మ్యాచ్ మొత్తం హార్దిక్​ను ర్యాగింగ్ చేశారు. కుక్క.. కుక్క అంటూ పాండ్యాను ఓ ఆటాడుకున్నారు. దీంతో స్టేడియంలోని హార్దిక్ ఫ్యాన్స్​.. రోహిత్ అభిమానులను టార్గెట్ చేశారని సమాచారం. ఒకర్నొకరు పొట్టుపొట్టుగా కొట్టుకోవడానికి ఇదే కారణమని వినికిడి. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. అయ్యిందేదో అయిపోయింది, ఇలాంటి గొడవలు మాని, క్రికెట్​ను ఎంజాయ్ చేయాలని అంటున్నారు. మరి.. రోహిత్-పాండ్యా ఫ్యాన్స్ ఫైట్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Cricket Addictor (@cricaddictor)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి