ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20 మ్యాచ్లో నెగ్గి సిరీస్ను 4-1 తేడాతో ముగించింది భారత్. ఈ మ్యాచ్లో మన టీమ్ గెలుపునకు 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20 మ్యాచ్లో నెగ్గి సిరీస్ను 4-1 తేడాతో ముగించింది భారత్. ఈ మ్యాచ్లో మన టీమ్ గెలుపునకు 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా తన డామినేషన్ను కంటిన్యూ చేస్తూ ఆస్ట్రేలియాతో పొట్టి సిరీస్ను ఘనంగా ముగించింది. ఐదు టీ20ల ఈ సిరీస్ను 4-1 తేడాతో చేజిక్కించుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ట్రిక్కీగా మారిన పిచ్ మీద మొదట బ్యాటింగ్ చేసిన మన జట్టు 8 వికెట్లకు 160 రన్సే చేయగలిగింది. శ్రేయస్ అయ్యర్ (53), అక్షర్ పటేల్ (31) రాణించారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (21)తో పాటు జితేష్ శర్మ (24)కు మంచి స్టార్ట్ దొరికినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మార్చలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో జేసన్ బెరెన్డార్ఫ్, బెన్ డ్వార్షూస్కు చెరో 2 వికెట్లు దక్కాయి. ఛేజింగ్కు దిగిన కంగారూ టీమ్ 20 ఓవర్లలలో 8 వికెట్లకు 154 రన్స్ మాత్రమే చేయగలిగింది.
ఆసీస్లో బెన్ మెక్డెర్మాట్ (54) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆఖర్లో మ్యాథ్యూ వేడ్ (22) గెలిపించడానికి ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించడానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది టాస్ ఓడిపోవడం. మందకొడిగా ఉన్న పిచ్ మీద టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా.. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఇక్కడ 155 ప్లస్ స్కోరు సాధిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ. అయితే ఆ స్కోరు లోపే టీమిండియాను కట్టడి చేద్దామనే ఉద్దేశంతో మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది అపోజిషన్ టీమ్. అందులో కాస్త సక్సెస్ అయ్యింది. 54 రన్స్కే నలుగురు భారత బ్యాటర్లను పెవిలియన్కు పంపింది. కానీ అయ్యర్ నిలబడటం, ఆఖర్లో జితేష్ శర్మ, అక్షర్ పటేల్ బ్యాట్లకు పనిచెప్పడంతో మంచి టార్గెట్ను ఆసీస్ ముందు ఉంచింది. ఛేదనలో భారత స్పిన్నర్ల దెబ్బకు ఆ టీమ్ కుదేలైంది. ఈ మ్యాచ్లో మన టీమ్ గెలవడానికి మరో కారణం శ్రేయస్ అయ్యర్.
ట్రిక్కీ పిచ్ మీద భారత బ్యాటర్లు ఎవరూ ఎక్కువ సేపు నిలవలేదు. ఓపెనర్లు సహా సూర్యకుమార్ యాదవ్ (5), రింకూ సింగ్ (6) వెంట వెంటనే పెవిలియన్కు చేరుకున్నారు. కానీ స్టార్ బ్యాటర్ అయ్యర్ పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. జితేష్, అక్షర్ పటేల్ లాంటి వారి అండతో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. శ్రేయస్ నిలబడ్డాడు కాబట్టే టీమ్ మంచి స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్లో మన గెలుపులో మరో ప్రధాన కారణం సూర్యకుమార్ కెప్టెన్సీ. బౌలింగ్ టైమ్లో మిస్టర్ 360 తన లీడర్షిప్ స్కిల్స్ను బయటపెట్టాడు. సిచ్యువేషన్ను బట్టి బౌలర్లను రొటేట్ చేస్తూ బ్రేక్ త్రూలు తీసుకురావడంలో మరోసారి సక్సెస్ అయ్యాడు. ఆఖర్లో వేడ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సూపర్బ్గా ఫీల్డింగ్ సెట్ చేశాడు సూర్య.
రన్స్ ఇస్తున్నా ముకేశ్, అర్ష్దీప్ మీద నమ్మకం ఆఖర్లో బౌలింగ్ చేయించాడు సూర్య. ఇది వర్కౌట్ అయి మ్యాచ్ గెలిచాం. ఈ మ్యాచ్లో భారత గెలుపునకు కారణాల్లో బౌలింగ్ కూడా ఒకటి. ఈ మ్యాచ్లో స్పిన్నర్లతో పాటు పేసర్లు కూడా రాణించారు. బిష్ణోయ్, అక్షర్ టైమ్కు బ్రేక్ త్రూలు ఇస్తూ ఆసీస్ను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ వచ్చారు. మొదట్లో ఫెయిలైన పేసర్స్.. లాస్ట్లో విజృంభించి బౌలింగ్ చేశారు. ముకేష్ 3 వికెట్లు తీయగా.. అర్ష్దీప్ 2 వికెట్లతో మెరిశాడు. ఆఖరి టీ20లో భారత్ విజయానికి ప్రధాన కారణాల్లో ఆఖరుది అర్ష్దీప్ సింగ్ బౌలింగ్. లాస్ట్ ఓవర్లో ఆసీస్ గెలుపునకు 10 పరుగులు అవసరం. అవతల ఉన్నది మ్యాథ్యూ వేడ్. అయినా ఏ మాత్రం వెరవకుండా బౌలింగ్ చేసి అతడ్ని ఔట్ చేశాడు. కేవలం 4 రన్స్ మాత్రమే ఇచ్చి సింగిల్ హ్యాండ్తో గెలిపించాడు. మరి.. ఈ మ్యాచ్లో భారత్ విజయానికి ఇంకేదైనా కారణం ఉందని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs SA: సఫారీ టూర్లో ఇద్దరు సీనియర్లకు నో ఛాన్స్.. సెలక్టర్లు చేసిందే కరెక్ట్ అంటున్న గంగూలీ!
Suryakumar Yadav handed over the Trophy to Rinku & Jitesh.
– A lovely gesture by the leader. pic.twitter.com/gwHdVxZRlA
— Johns. (@CricCrazyJohns) December 3, 2023