iDreamPost

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. హోటల్‌ మేనేజర్‌ మృతి

  • Author Soma Sekhar Published - 09:28 AM, Thu - 24 August 23
  • Author Soma Sekhar Published - 09:28 AM, Thu - 24 August 23
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. హోటల్‌ మేనేజర్‌ మృతి

భాగ్యనగరంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కిన్నెర గ్రాండ్ సందర్శిని హోటల్ జనరల్ మేనేజర్ దేవేందర్ గాయన్ మరణించారు. గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం సాయంత్రం దేవేందర్ పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గత కొద్ది రోజులుగా భాగ్యనగరంలో కల్పులు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి మహానగరం ఉలిక్కిపడింది. నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం హోటల్ జనరల్ మేనేజర్ పై గుర్తు తెలియని వ్యక్తులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు కిన్నెర గ్రాండ్ సందర్శిని హోటల్ జనరల్ మేనేజర్ దేవేందర్ గాయన్. తూటాలు శరీరంలో దిగడంతో.. తీవ్రంగా గాయపడ్డాడు దేవేందర్.

దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. దేవేందర్ కోల్ కత్తాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గత 6 నెలలుగా అతడు ఈ హోటల్ లో జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం ఇంటికి వెళ్లే టైమ్ లో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై హెల్మెట్ పెట్టుకుని వచ్చి అతడిపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారని, కంట్రీ మేడ్ పిస్టల్ ను దుండగులు ఉపయోగించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదికూడా చదవండి: భార్యపై కోపంతో కూతురిని హత్య చేసిన కసాయి తండ్రి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి