iDreamPost

టీమిండియాకు భారీ షాక్.. గాయం కారణంగా స్టార్ క్రికెటర్ దూరం!

  • Author Soma Sekhar Published - 10:59 AM, Fri - 17 November 23

వరల్డ్ కప్ లో ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఓ స్టార్ క్రికెటర్ జట్టుకు దూరమైయ్యాడు.

వరల్డ్ కప్ లో ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఓ స్టార్ క్రికెటర్ జట్టుకు దూరమైయ్యాడు.

  • Author Soma Sekhar Published - 10:59 AM, Fri - 17 November 23
టీమిండియాకు భారీ షాక్.. గాయం కారణంగా స్టార్ క్రికెటర్ దూరం!

ప్రపంచ కప్ 2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటూ.. ఫైనల్ కు చేరిన భారత్ టైటిల్ పోరులో ఆసీస్ ను ఢీకొనబోతోంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో ఇరు జట్లు అమీతుమీకి సిద్దమైయ్యాయి. సౌతాఫ్రికా టీమ్ 3 వికెట్ల తేడాతో ఓడించి.. ఫైనల్లోకి అడుగుపెట్టింది కంగారూ టీమ్. ఈ క్రమంలోనే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఓ స్టార్ క్రికెటర్ జట్టుకు దూరమైయ్యాడు.

వరల్డ్ కప్ లో ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ప్రపంచ కప్ లో భాగంగా లీగ్ దశలో బంగ్లాదేశ్ తో జరిన మ్యాచ్ లో గాయపడిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ లకు దూరం కానున్నాడు. చీలమండ గాయం కారణాంగా కనీసం మరో రెండు నెలల పాటు పాండ్యాకు విశ్రాంతి కావాలని వైద్యులు తెలిపినట్లు సమాచారం. దీంతో వరల్డ్ కప్ తర్వాత ప్రారంభం అయ్యే ఈ రెండు టీ20 సిరీస్ లకు ఈ స్టార్ ప్లేయర్ అందుబాటులో ఉండడని సమాచారం. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే ఈ వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ కు అందుబాటులోకి వస్తాడని వార్తలు వచ్చినప్పటికీ.. గాయం తగ్గలేదు. ఇక ఆసీస్ తో సిరీస్ వరల్డ్ కప్ ముగిసిన నాలుగు రోజులకే అంటే నవంబర్ 23న వైజాగ్ లో జరిగే మ్యాచ్ తో స్టార్ట్ అవుతుంది. ఈ టోర్నీ తర్వాత సౌతాఫ్రికాతో మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది భారత జట్టు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి