iDreamPost

ధోనిని వదలని గంభీర్‌! తాజాగా మరో సారి పరువు తీసేలా కామెంట్స్‌!

  • Published Mar 22, 2024 | 12:35 PMUpdated Mar 23, 2024 | 10:29 AM

Gautam Gambhir, MS Dhoni: ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి ఒక రోజు ముందు సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనిపై గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి గంభీర్‌ ఏం చెప్పాడు? ధోనిని వదలకుండా ఎందుకిలా వెంటపడుతున్నాడో ఇప్పుడ చూద్దాం..

Gautam Gambhir, MS Dhoni: ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి ఒక రోజు ముందు సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనిపై గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి గంభీర్‌ ఏం చెప్పాడు? ధోనిని వదలకుండా ఎందుకిలా వెంటపడుతున్నాడో ఇప్పుడ చూద్దాం..

  • Published Mar 22, 2024 | 12:35 PMUpdated Mar 23, 2024 | 10:29 AM
ధోనిని వదలని గంభీర్‌! తాజాగా మరో సారి పరువు తీసేలా కామెంట్స్‌!

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని గురించి.. మరో భారత మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ ఏదో ఒక కామెంట్‌ చేస్తూనే ఉంటాడనే విషయం తెలిసిందే. ముఖ్యంగా వన్డే వరల్డ్‌ కప్‌ 2011 గెలిచిన క్రెడిట్‌ అంతా ధోనికే దక్కిందనే కోపం గంభీర్‌లో చాలా కాలంగా ఉంది. ఆ విషయంపై అనేక సార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఇప్పుడు ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి ముందు మరోసారి ధోనిని ఉద్దేశిస్తూ.. గంభీర్‌ ఊహించని కామెంట్స్‌ చేశాడు. పైగా ఒక వీడియోను కూడా లింక్‌ చేస్తూ.. ట్వీట్‌ చేశాడు. ఆ వీడియో, ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ గంభీర్‌ ఏమన్నాడు? ఏ విషయంపై గంభీర్‌ స్పందిస్తూ.. ధోని పరువు తీసేలా ట్వీట్‌ చేశాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

చాలా మంది క్రికెట్‌ అభిమానులకు ధోని ఓరియో బిస్కెట్‌ యాడ్‌ గురించి తెలిసే ఉంటుంది. సోషల్‌ మీడియాలో బాగా ట్రోలింగ్‌కు గురైన యాడ్‌ అది. టీ20 వరల్డ్‌ కప్‌ 2022 సందర్భంగా ధోని తొలిసారి ఈ ఓరియో యాడ్‌ను క్రికెట్‌ వరల్డ్‌ కప్‌కు లింక్‌ చేస్తూ చేశాడు. అందులో.. 2011లో ఓరియో లాంచ్‌ అయింది టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలిచింది.. ఇప్పుడు మళ్లీ ఓరియో కొత్త వెర్షన్‌ లాంచ్‌ అవుతుంది.. టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలుస్తుందంటూ యాడ్‌ సారాంశం. ఆ యాడ్‌ బాగా వైరల్‌ కూడా అయింది. కానీ, టీమిండియా ఆ వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌లో దారుణ ఓటమి పొంది ఇంటిబాట పట్టింది. మళ్లీ వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో కూడా మళ్లీ ధోని.. ఓరియో యాడ్‌ చేశాడు. ‘ప్రతిసారి చెప్పడం వల్ల దిష్టి తగులుతుంది. అందుకే ట్విస్ట్‌ చేయండి ఏం చెప్పకండి’ అంటూ మరో యాడ్‌ వదిలారు.

వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఫైనల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దాంతో ధోని ఓరియో యాడ్‌ దారుణమైన ట్రోలింగ్‌కు గురైంది. ఈ ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌ జరగనున్న నేపథ్యంలో మరో ట్విస్ట్‌ అంటూ యాడ్‌ చేయొద్దంటూ.. ఆటగాళ్లను ఆడనివ్వండి, కప్పు గెలవనివ్వండి అంటూ.. పరోక్షంగా ఓరియోకు బ్రిటానియా బిస్కెట్‌ కంపెనీ కౌంటర్‌ యాడ్‌ చేసింది. ఆ యాడ్‌ను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన గంభీర్‌.. ‘వరల్డ్‌ కప్ ఆడి గెలిచిన నాకు ఒత్తిడి ఎంత ఉంటుందో, ఆనందం ఎలా ఉంటుందో కూడా తెలుసు. 140 కోట్ల మంది భారతీయులు ఊపిరి బిగపట్టి ఉంటారు.. ప్రపంచ కప్ గెలవడమే ముఖ్యం’ కాబట్టి, అబ్బాయిలు ఇంకేమీ ట్విస్ట్ తీసుకురావద్దు. ప్రకటన ప్లే చేయనివ్వవద్దు. కుర్రాళ్లను ఆడుకోనివ్వండి.’ అంటూ పరోక్షంగా ధోనికి సెటైర్‌ వేశాడు. మరి గంభీర్‌ చేసిన కామెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి