iDreamPost

వీడియో: పట్టపగలు రెచ్చిపోయిన దొంగలు.. తుపాకులతో బెదిరించి..!

వీడియో: పట్టపగలు రెచ్చిపోయిన దొంగలు.. తుపాకులతో బెదిరించి..!

దేశ రాజధాని ఢిల్లీలో రోజుకొక దారుణం వెలుగు చూస్తూనే ఉన్నాయి. మహిళలపై అత్యాచారాలు, వరుస చోరీలు వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఘటనలు మరువక ముందే ఇటీవల మరొకటి చోటు చేసుకుంది. పట్టపగలు కొందరు దొంగలు తుపాకులతో షాపు యజమానిని బెదిరించి అందిన కాడికి దోచుకున్నారు. ఈ చోరీ దృశ్యాలన్నీ షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని సమయ్ పుర్ బద్లీలో ఉన్న శ్రీరామ్ జ్యువెలర్స్ షాపుపై కొందరు దొంగలు చోరీకి పాల్పడాలని ముందే ప్లాన్ గీసుకున్నారు. ఇందులో భాగంగానే బుధవారం ముగ్గురు దొంగలు ముఖాలకు మాస్కులతో పాటు హెల్మెట్ ధరించి ఆ జ్యువెలరీ షాపులోకి ప్రవేశించారు. ఇక వస్తు వస్తునే చేతిలో ఉన్న తుపాకులతో అందులో ఉన్న షాపు యజమానితో పాటు పని వాళ్లను బెదిరించి అందిన కాడికి నగలు, అభరణాలు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

ఇదంతా షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అనంతరం లబోదిబోమన్న ఆ జ్యువెలరీ షాపు యజమాని వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దొంగల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి