iDreamPost
android-app
ios-app

ITI చేసి ఖాళీగా ఉన్నారా?.. వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి

ఐటీఐ పూర్తి చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందే ఛాన్స్. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులను అస్సలు వదలకండి. వెంటనే అప్లై చేసుకోండి.

ఐటీఐ పూర్తి చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందే ఛాన్స్. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులను అస్సలు వదలకండి. వెంటనే అప్లై చేసుకోండి.

ITI చేసి ఖాళీగా ఉన్నారా?.. వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తో పాటు ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో ప్రతిభకనబర్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్య్వూలు ఎదుర్కోవాలి. అన్ని దశల్లో ప్రతిభ చూపితే తప్పా ప్రభుత్వ ఉద్యోగం సొంతం కాదు. అయితే ఇటీవల యువత తక్కువ సమయంలోనే ఉపాధి అవకాశాలు పొందాలని ఒకేషనల్, ఐటీఐ వంటి కోర్సులను చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థల్లో కూడా ఐటీఐ ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. మరి మీరు కూడా ఐటీఐ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా?.. అయితే మీకు ఇదే మంచి అవకాశం. పరీక్ష రాయకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే ఛాన్స్ వచ్చింది. ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.

ఐటీఐ పాసైన వారికి రక్షణ రంగ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. రక్షణ శాఖలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పనిచేసే డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీలో అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 127 ఐటీఐ అప్రెంటీస్‌షిప్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. టర్నర్, మెకానిస్ట్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఐటీఐ అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేస్తారు. ఐటీఐ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక పోర్టల్ apprenticeshipindia.gov.inను సందర్శించి మే 31 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం అప్రెంటీస్‌షిప్ ఖాళీలు:

  • 127

విభాగాల వారీగా ఖాళీలు:

  • ఫిట్టర్ 20, టర్నర్ 8, మెషినిస్ట్ 16, వెల్డర్ 4, ఎలక్ట్రీషియన్ 12, ఎలక్ట్రానిక్స్ 4, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 60, కార్పెంటర్ 2, బుక్ బైండర్ 1.

అర్హతలు:

  • దరఖాస్తుదారులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయి ఉండాలి. అయితే ఎన్సీవీటీ,ఎస్వీవీటీ నుంచి ఐటీఐ అర్హత పరీక్ష క్వాలిఫై అయిన రెగ్యులర్ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయో పరిమితి:

  • అభ్యర్థుల వయసు కనీసం 18 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 55 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • పదోతరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ట్రైనింగ్ వివరాలు:

  • సెలక్ట్ అయిన వారికి హైదరాబాద్‌లోని డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీలో ట్రైనింగ్ ఉంటుంది. సంబంధిత ట్రేడ్‌లలో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

  • ఫీజు చెల్లించాల్సిన పని లేదు.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 31-05-2024

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Giriş