iDreamPost

పర్యటనలో ట్రాఫిక్‌కు అంతరాయం.. పవన్‌ను ప్రశ్నించిన సామాన్యుడు!

పర్యటనలో ట్రాఫిక్‌కు అంతరాయం.. పవన్‌ను ప్రశ్నించిన సామాన్యుడు!

టాలీవుడ్‌ స్టార్‌ హీరో.. జనసేన అధినేత పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వైజాగ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తన వారాహి వాహనంతో వైజాగ్‌లో రోడ్‌ షోలు, సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా తాజాగా, పవన్‌ కల్యాణ్‌కు దిమ్మ తిరిగే అనుభవం ఎదురైంది.  పర్యటన కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందంటూ ఓ వ్యక్తి  పవన్‌ను ప్రశ్నించాడు. పవన్‌ గాజువాక సభలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా, పవన్‌ కల్యాణ్‌ వైజాగ్‌లోని గాజు వాకలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఓ చోట రోడ్డుపై సభ నిర్వహించారు. ఈ సభ కారణంగా రోడ్డుపై భారీ స్థాయిలో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దాదాపు కొన్ని గంటల పాటు వాహనదారులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి పవన్‌ సభ వద్దకు వచ్చాడు. అక్కడి వారితో వాగ్వాదం పెట్టుకున్నాడు. దీంతో పవన్‌ వాగ్వాదం జరుగుతున్న చోటుకు వచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి  పవన్‌తోనూ వాగ్వాదానికి దిగాడు. ‘ మీ సభతో ఏం లాభం.. ప్రజలకు ఇబ్బందులు తప్ప’ అంటూ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు.

పవన్‌ సభ కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాడు. పవన్‌ను కొంచెం గట్టిగానే ప్రశ్నించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్‌ అంతరాయంపై పవన్‌ను ప్రశ్నించిన ఆ వ్యక్తిపై సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. పవన్‌ రోడ్లపై సభలు పెట్టి జనాన్ని ఇబ్బందులు పెడుతున్నారంటూ మండిపడుతున్నారు. మరి,  ఓ సామాన్యుడు పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి