iDreamPost

ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం

ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. మంత్రులు కూడా చేరుకోవడంతో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంమైంది.
రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్‌ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గం చర్చించనుంది.

ఈ అంశంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు, పంట మద్దతు ధరలు, కర్నూలో వెటర్నటీ కాలేజీ, ఏపీఐఐసీ నుంచి పరిశ్రమలకు భూముల కేటాయింపు తదితర అంశాలపై మంత్రివర్గం సమావేశంలో చర్చ జరుగనుంది. కాగా, ముఖ్యంగా జీఎన్‌ రావు కమిటీ నివేదికపైనే మంత్రివర్గం సమావేశంలో చర్చ సాగనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సమావేశం జరుగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి