iDreamPost

బైక్ కు అంత్యక్రియలు! అసలు సంగతి ఏంటంటే?

బైక్ కు అంత్యక్రియలు! అసలు సంగతి ఏంటంటే?

బైక్ కు అంత్యక్రియలు.. బైక్ కు అంత్యక్రియలు ఏంటని అతిగా ఆలోచిస్తున్నారా? అవును.. మీరు విన్నది నిజమే. ఓ యువకుడు బైక్ చుట్టు కట్టలు పేర్చి నిప్పు అంటించి అంత్యక్రియలు జరిపాడు. ఈ ఘటనను చూసి స్థానికులు అంతా ఒక్కసారిగా నోళ్లు తెరిచారు. అసలు ఆ యువకుడు ఎందుకు అలా చేస్తున్నాడని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అసలు విషయం తెలియడంతో స్థానికులు సైతం అతనికి మద్దుతునిచ్చారు. ఇదే ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఆ యువకుడు ఎందుకు బైక్ కు అంత్యక్రియలు జరిపాడు. అసలు స్టోరీ ఏంటంటే?

మీడియా కథనం ప్రకారం.. బీహార్ పాట్నాలోని ఓ ప్రాంతానికి చెందిన కృష్ణకుమార్ అనే యువకుడు సామాజిక కార్యకర్తగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇతడు బైక్ కు పూల మాల వేసి చుట్టూ కర్రలు పేర్చాడు. ఆ తర్వాత బైక్ కాకుండా కర్రలకు నిప్పు అంటించి అంత్యక్రియలు జరిపి వినూత్నంగా నిరసన తెలియజేశాడు. ఏంటని స్థానికులు అతడిని ప్రశ్నించగా.. గత కొంత కాలం నుంచి పోలీసులు రోజుకు 4 సార్లు చలాన్ విధిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిబంధలను వెనక్కి తీసుకోవాలని కోరానని కృష్ణకుమార్ తెలిపాడు. ఇలా ఇతను నిరసన తెలియజేయడంతో అందరూ అతనికి మద్దతును కూడగట్టారు. ఇదే ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

ఇది కూడా చదవండి: భారీ వర్షం కూడా వారిని ఆపలేకపోయింది.. ఆడాళ్లు మీకు జోహార్లు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి