iDreamPost

VIDEO:రెచ్చిపోయిన దుండగులు.. ఇంట్లోకి చోరబడి మహిళపై ఐదుగురు ఒకేసారి..!

VIDEO:రెచ్చిపోయిన దుండగులు.. ఇంట్లోకి చోరబడి మహిళపై ఐదుగురు ఒకేసారి..!

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఐదుగురు దుండుగులు ఓ ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి దూసుకెళ్లారు. ఇంతే కాకుండా ఒంటరిగా ఉన్న మహిళను బెదిరించి కిరాతకానికి పాల్పడ్డారు. దీంతో ఆ మహిళ వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా అస్సలు వదలేదు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. అసలేం జరిగిందంటే?

దేశంలో మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలకుండా దుండగులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఉత్తర్ ప్రదేశ్ లక్నాలోని ఎంఐ రిట్రీట్ భవనంలోని ఓ ఇంట్లో ఓ మహిళ నివాసం ఉంటుంది. అయితే ఇటీవల ఐదుగురు ఆ భవనంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆ మహిళ ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి ఆమెపై దాడికి దిగారు. దీంతో ఆ మహిళ వారి నుంచి అతి కష్టంగా తప్పించుకుని బయటపడింది. ఆ తర్వాత ఆ యువకులు లోపలికి వెళ్లారు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి