iDreamPost

ఆర్య వైశ్య కార్పోరేషన్షన్ కు నూతన ఛైర్మన్

ఆర్య వైశ్య కార్పోరేషన్షన్ కు నూతన ఛైర్మన్

బాలినేని శ్రీనివాస రెడ్డి అనుచరుడిగా కుప్పం ప్రసాద్ వైఎస్ ఆర్ వాణిజ్య విభాగం రాష్ట్ర అద్యక్షుడిగా నియమితులయ్యారు.కుప్పం ప్రసాద్ రాష్ట్రమంతా తిరిగి వైశ్యుల ను వ్యాపార వర్గాలను ఏకం చేయడానికి ప్రయత్నించి కొంత మేర సఫలీకృతుడయ్యారు.

అయితే ఇది ఒక్కటే ఆర్య వైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ అవ్వడానికి సరిపోయిందా అంటే కాదు అని చెప్ప వచ్చు.ఎన్నికల ముందు పత్రికా ముఖంగా ప్రతిష్టాత్మక ఆర్య వైశ్య మహాసభ నుండి వై .ఎస్.ఆర్ .సిపి కి మద్దతు నిస్తున్నాము అని చెప్పడం ఇక్కడ ప్రస్తావించవచ్చు.సౌమ్యుడు, అందరినీ ప్రేమగా పలకరించే కుప్పం ప్రసాద్ ఒక సంవత్సర కాలం పాటు పదవిలో ఉంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి