iDreamPost

రేపటి నుంచి ఆర్టీసీ సేవలు షురూ.. మార్గదర్శకాలు ఇవే..

రేపటి నుంచి ఆర్టీసీ సేవలు షురూ.. మార్గదర్శకాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులు రేపు గురువారం ఉదయం ఆరు గంటల నుంచి పరుగులు పెట్టనున్నాయి. లాక్‌డౌన్‌ నాలుగో విడతలో ఆర్టీసీ బస్సులు తిప్పుకునే వెలుసుబాటు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడపాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. భౌతిక దూరం పాటించేలా బస్సుల్లో 50 శాతం సామర్థ్యంతోనే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయనున్నాయి.

కరోనా నేపథ్యంలో ఆర్టీసీ ప్రయాణాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

– జిల్లాలు, డిపోల మధ్య మాత్రమే సర్వీసులు నడుస్తాయి.

– మార్గమధ్యలో ఎక్కడా ఆగి ప్రయాణికులను ఎక్కించుకోరు.

– ప్రతి ప్రయాణికుడికి మాస్క్‌ తప్పనిసరి

– టిక్కెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకోవాలి.

– టిక్కెట్‌ చూపించడం, మోబైల్‌ మెస్సెజ్‌ చూపించాల్సిన అవసరం ఉండదు.

– 10 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు అనారోగ్య, అత్యవసర కారణాలు ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి