iDreamPost

మరో టమాటా రైతును హత్య చేసిన దుండగులు

మరో టమాటా రైతును హత్య చేసిన దుండగులు

గత కొన్ని రోజుల నుంచి టమాటా ధర ఆకాశానికి తాకింది. అయితే, ప్రస్తుతం కిలో టమాటా ధర రూ. 120 నుంచి 250 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యులు టమాటాను కొనాలేక వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు టమాటాను పంట పాలాల నుంచే కాకుండా మార్కెట్ల నుంచి దొచుకుంటున్నారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన రైతును సైతం ప్రాణాలతో లేకుండా చేస్తున్నారు. ఇటీవల మదనపల్లెలో టమాటా రైతు హత్య ఘటన మరువకముందే తాజాగా అన్నమయ్య జిల్లాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మరో టమాటా రైతును దారుణంగా హత్య చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని అన్నమయ్య జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలంలోని నవాబుకోటలో భర్తల మధుకర్ రెడ్డి అనే రైతు నివాసం ఉంటున్నాడు. అయితే, తనుకున్న పొలంలో మధుకర్ రెడ్డి కొంత భాగం టమాటా పంటను పండించాడు. ప్రస్తుతం టమాటాకు ఎక్కువ ధర ఉండడంతో అతడు భారీగానే సంపాదిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. పొలంలో ఉన్న టమాటాను దొంగలు ఎత్తుకెళ్లకుండా మధుకర్ రెడ్డి కాపలాగా వెళ్లి రాత్రిపూట పొలంలోనే పడుకుంటున్నాడు. ఇక మధుకర్ రెడ్డి ఎప్పటిలాగే ఆదివారం రాత్రి కూడా పొలానికి వెళ్లి వేసుకున్న టెంట్ కింద పడుకున్నాడు. అదే రోజు రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు వచ్చి నిద్రలో ఉన్న మధుకర్ రెడ్డిని గొంతు కోసి దారుణంగా హత్య చేసి పరారయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెలు పగిలే ఏడ్చారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్నఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: భర్త కళ్లముందే ప్రియుడితో భార్య రొమాన్స్! కానీ, భర్త ఇలా చేశాడేంటి?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి