iDreamPost

12 ఏళ్ల బాలికపై దారుణం! మృగాలుగా మారిన దేవాలయ ట్రస్ట్‌ ఉద్యోగులు

  • Published Jul 29, 2023 | 12:49 PMUpdated Jul 29, 2023 | 4:33 PM
  • Published Jul 29, 2023 | 12:49 PMUpdated Jul 29, 2023 | 4:33 PM
12 ఏళ్ల బాలికపై దారుణం! మృగాలుగా మారిన దేవాలయ ట్రస్ట్‌ ఉద్యోగులు

దైవ సేవలో భాగంగా దేవాలయ ట్రస్ట్‌ బోర్డులో పనిచేస్తున్న వారు బుద్ధి గడ్డితినింది. పవిత్రమైన పనిలో ఉంటూ కూడా పాపపు పని చేసి ఓ బాలిక ఉసురుపుసుకున్నారు. ఓ ప్రముఖ దేవాలయ ట్రస్ట్‌లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు 12 ఏళ్ల బాలికపై అత్యంత క్రురంగా దాడి చేసి.. అత్యాచానికి పాల్పడ్డమే కాకుండా, ఆ బాలిక ప్రైవేట్‌ పార్ట్‌లో ఓ బలమైన వస్తును చొప్పించారు. ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా మైహార్‌ పట్టణంలో చోటు చేసుకుంది. సభ్యసమాజం సిగ్గు తలదించుకునే ఈ దారుణానికి పాల్పడిన వారిని రవీంద్ర కుమార్‌ రవి(30), అతుల్‌ భడోలియాగా(30) పోలీసులు గుర్తించి, వారిని అరెస్ట్‌ చేశారు.

తీవ్ర రక్తస్రావమైన బాలికను అధునాతన వైద్య సంరక్షణ కోసం డివిజనల్ హెడ్‌క్వార్టర్స్ రీవాలోని ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచి, వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం కోసం శిక్ష), 376డిబి (12 ఏళ్లలోపు మహిళపై సామూహిక అత్యాచారానికి శిక్ష), 366A (మైనర్ బాలికను స్వాధీనం చేసుకోవడం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 324 (స్వచ్ఛందంగా గాయపరచడం) అలాగే లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే పోక్సో చట్టం కింద కేసు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే.. రవి, అతుల్‌ పనిచేస్తున్న సదరు దేవాలయ కమిటీ సైతం ఈ ఘటనపై స్పందించింది. రవి, భడోలియాలను తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు మాత శారదా దేవి మందిర్ మేనేజ్‌మెంట్ కమిటీ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. వారి అసభ్యకరమైన చర్య ఆలయ ప్రతిష్టను దిగజార్చిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పెళ్లైన ఏడాదికే కాంగ్రెస్‌ నేత కుమారుడి భార్య మృతి.. హత్యా.. గుండె పోటా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి