iDreamPost

థియేటర్లో ఒక్కళ్ళు లేరు.. స్టార్ హీరో షో రద్దు!!

థియేటర్లో ఒక్కళ్ళు లేరు.. స్టార్ హీరో షో రద్దు!!

బాలీవుడ్ హీరోల టైమ్ ఈ మధ్య అస్సలు బాలేదు. పెద్ద హీరోల సినిమాలు సైతం బాక్సీఫీసు వద్ద బెడిసి కొడుతున్నాయి. ఇందుకు వరుస విజయాల సూపర్ స్టార్ కూడా అతీతం కాదని ఋజువైంది.

అక్షయ్ కుమార్ – మానుషి ఛిల్లర్ నటించిన చిత్రం  ‘పృథ్వీరాజ్’ జూన్ 3న విడుదలైంది. దిల్లీని రాజ్యంగా చేసుకొని పరిపాలన చేసిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అయితే ఈ సినమాకు ప్రేక్షుకులే కరువయ్యారు. థియేటర్ల వద్ద ప్రేక్షకులు లేక ఈ సినిమా ప్రదర్శనను ఆపేసినట్లు బాలీవుడ్ మీడియా చెప్తోంది.

ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ తో యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. హిందీ, తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేయడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నా, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా కూడా పెద్ద టాక్ లేక థియేటర్లు బోసిపోయాయి. కొన్ని థియేటర్లలో అధిక భాగం సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక థియేటర్లో ఏకంగా షోనే రద్దు చేశారట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి