iDreamPost

Virat Kohli: అక్తర్ షాకింగ్ కామెంట్స్.. కోహ్లీ గొప్ప క్రికెటరే.. కానీ సచిన్​తో పోలిస్తే..!

  • Published Jan 21, 2024 | 7:18 PMUpdated Jan 21, 2024 | 7:18 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ గొప్ప క్రికెటర్ అంటూనే సచిన్ టెండూల్కర్​తో అతడ్ని పోల్చాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ గొప్ప క్రికెటర్ అంటూనే సచిన్ టెండూల్కర్​తో అతడ్ని పోల్చాడు.

  • Published Jan 21, 2024 | 7:18 PMUpdated Jan 21, 2024 | 7:18 PM
Virat Kohli: అక్తర్ షాకింగ్ కామెంట్స్.. కోహ్లీ గొప్ప క్రికెటరే.. కానీ సచిన్​తో పోలిస్తే..!

ఎవరు గొప్ప? అనే చర్చ ప్రతి రంగంలోనూ ఎప్పుడూ జరిగే డిస్కషనే. క్రికెట్​లో కూడా ఇది సాధారణమే. ఏ బ్యాటర్ గొప్ప? ఏ బౌలర్ గ్రేట్? ఏ కెప్టెన్ బెస్ట్? అనే విషయాలపై నిరంతరం వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా బ్యాటింగ్​లో ఎవరు గొప్ప అనే డిస్కషన్​ జరగడం చాలా కామన్. అయితే గత దశాబ్దం కింద వరకు దీనికి ఆస్కారం లేదు. ఎందుకుంటే సచిన్ టెండూల్కర్ రూపంలో క్రికెట్ వరల్డ్ మీద భారత్ ఫుల్ డామినేషన్ చూపించింది. సచిన్ ఉన్నన్ని రోజులు ఈ చర్చ జరగలేదు. అతడే గొప్ప అని అందరూ ముక్తకంఠంతో ఒప్పుకున్నారు. కానీ క్రికెట్ గాడ్ రిటైర్మెంట్ తర్వాత ఎవరు ఆ స్థాయికి చేరుకుంటారనేది ఆసక్తిని సంతరించుకుంది. అయితే టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ రూపంలో మరో బ్యాటింగ్ డైమండ్ వచ్చింది. పదిహేనేళ్లుగా క్రికెట్​ను ఏలుతున్నాడు కింగ్. సచిన్ సృష్టించిన ఎన్నో రికార్డులను అతడు బ్రేక్ చేశాడు. అలాంటి కోహ్లీపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

కోహ్లీ గొప్ప బ్యాట్స్​మన్ అని మెచ్చుకున్నాడు అక్తర్. విరాట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూనే.. అతడ్ని సచిన్​తో పోలుస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తమ తరంతో పోటీ పడే ప్లేయర్ ఒక్క కోహ్లీ మాత్రమేనని అన్నాడు. ‘మా తరంలో సచిన్ టెండూల్కర్ బెస్ట్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. వాళ్లు సంధించిన రివర్స్ స్వింగ్ బాల్స్​ను సూపర్బ్​గా ఆడాడు. ఈ తరంలో టెండూల్కర్ బ్యాటింగ్ చేసి ఉంటే మరింత భారీగా పరుగులు చేసేవాడు. మేం ఆడిన సమయంలో సచిన్​తో పాటు రికీ పాంటింగ్, బ్రియాన్ లారా బెస్ట్ బ్యాట్స్​మెన్. బౌలింగ్​లో వసీం అక్రమ్, షేన్ వార్న్​లు అత్యుత్తమం. మా తరంతో పోటీపడే సత్తా ఉన్న ప్రస్తుత ఆటగాడు అంటే కోహ్లీ పేరు మాత్రమే చెబుతా. కానీ అతడు మా తరంలో ఆడి ఉంటే ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. ప్రస్తుతంలా ఇంత ఈజీగా రన్స్ చేసేవాడు కాదు. పాక్ బౌలింగ్​ను చీల్చి చెండాడినా.. వసీం అక్రమ్​ను మాత్రం ఎదుర్కోలేకపోయేవాడు. అతడ్ని ఫేస్ చేయడం అంత సులువు కాదు’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ నెక్స్ట్ లెవల్ ప్లేయర్ అని.. ఈ తరం అత్యుత్తుమ ఆటగాడు అతడేనని అక్తర్ పేర్కొన్నాడు. విరాట్​కు హ్యాట్సాఫ్ అని.. అతడు 100 సెంచరీలు సాధించాలని తాను కోరకుంటున్నానని తెలిపాడు. ఇక, ఇవాళ కోహ్లీ హైదరాబాద్​కు చేరుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ 2023-25లో భాగంగా సొంతగడ్డ మీద ఇంగ్లండ్​తో ఐదు టెస్టుల సిరీస్​లో ఆడనుంది టీమిండియా. జనవరి 25వ తేదీన జరిగే ఫస్ట్ మ్యాచ్​తో ఈ సిరీస్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం భాగ్యనగరానికి చేరుకున్నాడు విరాట్. ఈ సిరీస్​కు ముందు జరిగే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించే యానువల్ అవార్డ్స్ ఫంక్షన్​లో అతడు పాల్గొననున్నాడు. కరోనా తర్వాత భారత బోర్డు నిర్వహిస్తున్న తొలి వార్షిక పురస్కారాల వేడుక ఇదే కానుంది. ఈ ఫంక్షన్​కు కోహ్లీతో పాటు మిగిలిన టీమిండియా క్రికెటర్స్, ఇంగ్లండ్ ప్లేయర్స్ కూడా అటెండ్ కానున్నారు. మరి.. కోహ్లీని సచిన్​తో పోలుస్తూ అక్తర్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి