iDreamPost

వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ సంచలన పోస్ట్‌! అనుష్క సైతం..

  • Published Oct 04, 2023 | 1:41 PMUpdated Oct 04, 2023 | 1:41 PM
  • Published Oct 04, 2023 | 1:41 PMUpdated Oct 04, 2023 | 1:41 PM
వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ సంచలన పోస్ట్‌! అనుష్క సైతం..

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డ్ వరల్డ్ కప్‌ మహా సంగ్రామం రేపటి నుంచి ప్రారంభం కానుంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌, గత వరల్డ్ కప్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో వరల్డ్‌ కప్‌ మహా సంగ్రామం మొదలుకానుంది. అయితే.. ఈసారి కప్పు ఇండియానే కొడుతుందని భారత క్రికెట్‌ అభిమానులు ధీమాగా ఉన్నారు. టీమ్‌ సమతుల్యంగా ఉండటం, టీమ్‌లోని ప్రతి ఆటగాడు మంచి ఫామ్‌లో ఉండటంతో 2011 మ్యాజిక్‌ను టీమిండియా మళ్లీ రిపీట్‌ చేస్తుందని అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ లాంటి స్టార్లు ఆడితే.. టీమిండియాను ఒంటిచేత్తో గెలిపిస్తారని అంటున్నారు. కాగా, వరల్డ్‌ కప్‌లో టీమిండియా బలాబలాల గురించి పక్కనపెడితే.. తాజాగా విరాట్‌ కోహ్లీ చేసిన ఓ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వరల్డ్‌ కప్‌ ముందు విరాట్‌ కోహ్లీ నుంచి ఇలాంటి పోస్ట్‌ రావడంతో చాలా మంది షాక్‌ అవుతున్నారు. ఇంతకీ కోహ్లీ ఏం చెప్పాడంటే.. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు చూసేందుకు టిక్కెట్ల కోసం దయచేసి తనను సంప్రదించొద్దని తన స్నేహితులకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టాడు. సాధారణంగా వరల్డ్‌ కప్‌ అనే కాదు.. టీమిండియా ఏ మ్యాచ్‌లు ఆడినా కూడా జట్టులోని ఆటగాళ్లకు టిక్కెట్ల కోసం వారి సన్నిహితులు, స్నేహితుల నుంచి రిక్వెస్టులు వస్తుంటాయి. అలాగే ఆటగాళ్లకు కూడా ఆయా బోర్డులు కొన్ని టిక్కెట్లను వారి కుటుంబ సభ్యుల కోసం కేటాయిస్తుంటారు. అయితే.. వరల్డ్‌ కప్‌ లాంటి ప్రధాన టోర్నీపై ఫోకస్‌ పెట్టడానికి.. కోహ్లీ ఈ టికెట్ల లొల్లిని పక్కనపెట్టాలని ఫిక్స్‌ అయినట్లు ఉన్నాడు. పైగా ఒకరికి టికెట్‌ ఇస్తే ఇంకొకరి ఇవ్వలేదనే కోపాలు, తాపాలు అదనపు తలనొప్పి. వీటికి దూరంగా ఉండేందుకే కోహ్లీ ముందుగానే తన ఫ్రెండ్స్‌కు ఒక సూచన్‌ చేశాడు. తనను టిక్కెట్ల గురించి అడగొద్దని అన్నాడు.

కాగా, కోహ్లీ పోస్టుకు అతని సతీమణి, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ సైతం వత్తాసు పలుకుతూ.. ఒక వేళ కోహ్లీ టిక్కెట్ల విషయంలో రియాక్ట్‌ కాకుండా.. వెంటనే తనను సంప్రదించొద్దని సరదాగా పోస్టు చేసింది. కోహ్లీ ఆన్సర్‌ ఇవ్వకుంటే.. వెంటనే కోహ్లీ భార్య అయిన ఆమెకే కదా బంధువులు కానీ, ఫ్రెండ్స్‌ కానీ, ఆ ఉద్దేశంతో అనుష్క అలా రియాక్ట్‌ అయింది. దీంతో ఈ రెండు పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత్‌-పాక్‌ మధ్య సరికొత్త సిరీస్‌కు ప్లానింగ్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి