iDreamPost

వీడియో: ఘోర ప్రమాదం.. నదిలో పడ్డ ట్రాక్టర్, 9 మంది మృతి!

వీడియో: ఘోర ప్రమాదం.. నదిలో పడ్డ ట్రాక్టర్, 9 మంది మృతి!

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ అదుపు తప్పి నదిలో పడింది. దీంతో 9 మంది చనిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ సహరాన్ పూర్ జిల్లా కొత్వాలి దేహత్ పరిధిలోని బండ్కి గ్రామ సమీపంలో బుధవారం 50 మంది భక్తులతో ఓ ట్రాక్టర్ బయలు దేరింది. అయితే ప్రమాదవశాత్తు ఆ ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న ఓ నదిలో పడిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో పిల్లలతో సహా 9 మంది భక్తులు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇక క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరణవార్త తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ ఘోర ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మృతి చెందిన వారికి ఆర్థిక సాయం ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

ఇది కూడా చదవండి: నాన్న ఒక్కసారి కూడా గుర్తు రాలేదా? ఇలా చేశావ్ ఏంటి తల్లి?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి