iDreamPost

బంగారు భవిష్యత్ ఊహించుకున్నారు.. అంతలోనే..

Nizamabad Crime News: ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Nizamabad Crime News: ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

బంగారు భవిష్యత్ ఊహించుకున్నారు.. అంతలోనే..

ఇటీవల కొంతమంది ప్రతి చిన్న విషయాలకు గొడవ పడుతూ మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేమ విషయాలు, ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, వివాహేతర సంబంధాల ఇలా ఎన్నో కారణాల వల్ల గొడవలు జరగడం, మనస్థాపానికి గురి కావడం వల్ల సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఓ చిన్న కారణం వల్ల ప్రేమికులు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

నిజామాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ప్రేమికులు బాసర రైల్వే స్టేషన్ సమీపంలో నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పపడ్డారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటగల్లికి చెందిన సూరం శ్రీకాంత్ (28), సీతారాంనగర్ కాలనీకి చెందిన నందిత (20) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు శ్రీకాంత్ విశ్వభారతి స్కూల్ లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొంత కాలం క్రితం వీరిద్దరికి పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది.

నందిత నిశిత డిగ్రీ కాలేజ్ లో సెకండ్ ఇయర్ చదువుతుంది. వీరి ప్రేమ విషయం తెలిసి పెద్దలు సీరియస్ అయినట్లు తెలుస్తుంది. దీంతో తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని.. కలిసి బతకలేని తాము కలిసి చనిపోదామని నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాంత్ హైదరాబాద్ కి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. నందిత కాలేజ్ కి వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు పాల్పపడినట్లు తెలుస్తుంది. నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి ఈ కేసు విచారణ జరుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి