iDreamPost

భార్య ముందే లవర్ తో కలిసి భర్త.. ఈమె కష్టం ఏ మహిళకు రాకూడదు..!

  • Published Apr 17, 2024 | 10:10 PMUpdated Apr 17, 2024 | 10:10 PM

Indore Crime News: భర్తతో ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకుంది. కానీ భర్త వంకర బుద్ది కారణంగా ఆ మహిళ ఎన్నో ఇబ్బందులు పడింది.

Indore Crime News: భర్తతో ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకుంది. కానీ భర్త వంకర బుద్ది కారణంగా ఆ మహిళ ఎన్నో ఇబ్బందులు పడింది.

  • Published Apr 17, 2024 | 10:10 PMUpdated Apr 17, 2024 | 10:10 PM
భార్య ముందే లవర్ తో కలిసి భర్త.. ఈమె కష్టం ఏ మహిళకు రాకూడదు..!

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. వేద మంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు కలిసి జీవించాలని పెద్దలు, బంధు మిత్రులు ఆశీర్వదిస్తారు. కానీ ఈ మధ్య కొంతమంది పెళ్లైన కొంత కాలానికే వివిధ కారణాల వల్ల విడిపోతున్నారు. ఇందుకు కారణాలు చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు. ఇటీవల దేశంలో అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి.  ఎన్నో కుటుంబాల్లో అక్రమ సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి.  భార్యాభర్తల మధ్య విభేదాల కారణాంగా అక్రమ సంబంధాలు కొనసాగించడం.. దీంతో ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. ఓ భర్త అక్రమ సంబంధం కారణంగా భార్య దారుణమైన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేవ్ ఇండర్ లో ఓ మహిళ తన భర్త అతని ప్రియురాలు చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ఇక తట్టుకోవడం తన వల్ల కాదని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన చేతిపై సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పపడటం తీవ్ర కలకం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ సిల్వర్ స్ప్రింగ్ సొసైటీలో ఉంటున్న కవిత (40) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పపడింది. సోమవారం మధ్యహ్నం కవిత మృతదేహం ఫ్యాన్ కి వెలాడుతూ కనిపించింది.

కవిత ఆత్మహత్య చేసుకునే ముందు తన చేతిపై భర్త పంకజ్ అతని ప్రియురాలు నమ్రత పేర్లను రాసి తన మరణానికి వారిద్దరిని బాధ్యులను చేసింది. కొంత కాలంగా తన భర్త పంకజ్, నమ్రత ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని.. దాన్ని ప్రశ్నించినందుకు నన్ను చిత్ర హింసలకుగురి చేస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతిరోజూ తిట్టడం, కొట్టడం చేస్తున్నాడని తెలిపింది. వీరిద్దరి చిత్ర హింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మరాఠీ భాషలో చేతిపై రాసి చనిపోయింది. అడిషనల్ డీసీపీ రాజేష్ దండోతియా మృతదేహానని పోస్ట్ మార్టం తరలించారు. కవిత భర్తపై కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే తేజాజి నగర్ పోలీసులు భర్త, అతని ప్రియురాలిపై కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి